AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పునూరు.. ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా ట్రిపుల్‌ ప్లే సర్వీసులు అందిస్తామన్న గౌతంరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా వైసీపీ సీనియర్‌ లీడర్‌ పునూరు గౌతమ్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్ధనల అనంతరం..

ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పునూరు..  ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా ట్రిపుల్‌ ప్లే సర్వీసులు అందిస్తామన్న గౌతంరెడ్డి
K Sammaiah
|

Updated on: Feb 06, 2021 | 12:19 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా వైసీపీ సీనియర్‌ లీడర్‌ పునూరు గౌతమ్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్ధనల అనంతరం చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా బాధ్యత అప్పగించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేస్తానని పునూరు చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌గ్రిడ్‌లో వేల కోట్ల రూపాయలు కైంకర్యం అయ్యాయని ఆరోపించారు. ఎలాంటి అనుమానాలకు, అవినీతికి తావులేకండా పని చేస్తానని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ట్రిపుల్ ప్లే సర్వీస్ లు అందిస్తామని అన్నారు. ఒకై లైన్‌ ద్వారా కేబుల్, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తామిన చెప్పారు. ట్రిపుల్ ప్లే సర్వీసులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకు అందిస్తామని అన్నారు.

మండల, గ్రామ స్థాయిలో అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ వేస్తామని గౌతంరెడ్డి చెప్పారు. పైబర్ గ్రిడ్ లో 10లక్షల కనేషన్స్ ఉన్నాయి.త్వరలో కొత్త సెట్ టాప్ బాక్స్ లు తీసుకువస్తాం. రాబోయే తరాలకు ఇంటర్నెట్ అవసరం. 599 రూపాయలకే అన్ లిమిటెడ్ ప్లాన్ తో నెట్ కేబుల్ ఇస్తాం. ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చిన లాప్ టాప్ లకు ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్‌నెట్ ఇస్తామని గౌతంరెడ్డి అన్నారు.

ప్రజల్లో ఫైబర్ గ్రిడ్ కి ఆదరణ ఉంది. గత ప్రభుత్వం చేసిన అవినీతి ని వెలికితీస్తాం. సీబీఐ విచారణ కూడా చేస్తుంది. అవినీతి కి పాల్పడిన ఒక్కరిని కూడా వదలమన్నారు గౌతం రెడ్డి. 300 రూపాయలకు కేబుల్ ఇస్తాం. పైబర్ గ్రిడ్ ను ఇంధన శాఖ లో అనుసంధానం చేశారు. కేబుల్ అవసరం లేనివారికి ఇంటర్నెట్ ఇస్తామిన తెలిపారు.

Read more:

మరో నగారాకు సిద్ధమవుతున్న ఏపీ ఎస్‌ఈసీ, పంచాయతీ ముగిసిన వెంటనే ఆ ఎన్నికలకు ప్లాన్‌ సిద్ధం చేస్తున్న నిమ్మగడ్డ..?