ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. అడిషనల్ డీజీపీకి తప్పిన పెను ప్రమాదం..

|

Dec 07, 2020 | 11:33 AM

కృష్ణా జిల్లా నందిగామ అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలాకు పెను ప్రమాదం తప్పింది. కంచికచర్ల పట్టణం శివారులో బైక్‏ను అడిషనల్ డీజీపీ కారు ఢికొట్టింది.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. అడిషనల్ డీజీపీకి తప్పిన పెను ప్రమాదం..
Follow us on

Krishna: కృష్ణా జిల్లా నందిగామ అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలాకు పెను ప్రమాదం తప్పింది. కంచికచర్ల పట్టణం శివారులో బైక్‏ను అడిషనల్ డీజీపీ కారు ఢికొట్టింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి రహదారి పక్కన గల కందకంలోకి డీజీపీ కారు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బైక్ పై ఉన్న వ్యక్తి కంచిక చర్ల పట్టణానికి చెందిన కర్రీ నరసింహరావుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులోనే ఉన్న అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలా సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే ఆయనను వేరే కారులో తరిలించారు సెక్యూరిటీ సిబ్బంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి దర్యాప్తు చేపట్టారు.