RK: వైద్యం అందకుండా చేసి చంపేశారు.. ఇది ప్రభుత్వ హత్యే.. కన్నీటి పర్యంతమైన ఆర్కే భార్య శిరీష

|

Oct 15, 2021 | 1:58 PM

ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు ఆర్కే భార్య శిరీష. అడవి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి వైద్యం అందకుండా చేసి చంపేశారని ఆరోపించారామె. 

RK: వైద్యం అందకుండా చేసి చంపేశారు.. ఇది ప్రభుత్వ హత్యే.. కన్నీటి పర్యంతమైన ఆర్కే భార్య శిరీష
Rk Wife Sirisha
Follow us on

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిని.. మావోయిస్టు పార్టీ ధృవీకరించింది. ఈ నెల 14న ఆయన చనిపోయినట్టు ప్రకటించారు మావోయిస్టు అధికార ప్రతినిది అభయ్. కిడ్నీలు ఫెయిల్ అవడంతో చనిపోయినట్టు తెలిపారాయన. చికిత్స చేసినా ఆర్కేను కాపాడులేకపోయామని ప్రకటించారు. విప్లవ శ్రేణుల మధ్యే అంత్యక్రియలు జరిగినట్టు పార్టీ స్పష్టం చేసింది. ఆర్కే మరణ వార్త విని.. ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు ఆర్కే భార్య శిరీష. అడవి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి వైద్యం అందకుండా చేసి చంపేశారని ఆరోపించారామె.

ఆర్కే.. ప్రజల కోసం పోరాడి గొప్ప యోధుడనీ.. అతని ఆశయాలను కొనసాగిస్తామనీ తెలిపారు. ఆర్కేకు జోహార్లు పలికారు. అర్కే అమర్ రహే అంటూ కన్నీటితో నినాదాలు చేశారు. ప్రజల కోసం జీవించిన మనిషికి.. వీరుల మధ్య అంత్యక్రియలు జరిగాయన్నారు శిరీష.

ఆర్కే ప్రజా హృదయాల్లో నిలిచి ఉంటారని అన్నారు విరసం నేత కళ్యాణ్ రావు. పోలీసుల నిర్భంధం లేకుండా చేయడం ద్వారానే ఆయన చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: RK: ఆర్కే నిజంగానే చనిపోయాడా.. వెంటాడుతున్న ఓ అనుమానం.. అది నిజమేనా..

Dasara – Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..