AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏజెన్సీలో తీవ్ర విషాదం.. మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి.. సీఎం కీలక ఆదేశాలు..

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణకు పంపిణీ చేసిన క్లోరోక్విన్‌ మాత్రల అనంతరం పలువురు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. 71 మందికి మాత్రలు పంపిణీ చేయగా.. 53 మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 46 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మడివి జమున (7) అనే చిన్నారి వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఏజెన్సీలో తీవ్ర విషాదం.. మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి.. సీఎం కీలక ఆదేశాలు..
Polavaram Malaria Incident
Anand T
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 6:40 AM

Share

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది.. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కొందరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 46 మంది రెండు నుంచి పదేళ్లలోపువారు కాగా మిగిలిన ఏడుగురు పెద్దలున్నారని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారి పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

71 మందికి క్లోరోక్విన్‌ మాత్రలు..

మంగళవారం మధ్యాహ్నం వైద్య సిబ్బంది మలేరియా నివారణకు క్లోరోక్విన్‌ మాత్రలను విద్యార్థులు సహా 71 మందికి అందజేశారు. అనంతరం మడివి జమున (7) ఇంటికి వెళ్లి వాంతులు చేసుకోవడంతో లక్ష్మీపురం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతోపాటు.. పాఠశాల, అంగన్‌వాడీ చిన్నారులు సైతం అస్వస్థతకు గురవడంతో జిల్లా యంత్రాంగం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సీఎం కీలక ఆదేశాలు..

కాగా.. పోలవరం జిల్లా గొల్లగుప్ప ఘటనపై సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వమించారు. మలేరియా నివారణ క్లోరోక్విన్ టాబ్లెట్లు వికటించి ఒక బాలిక చనిపోయిందనే సమాచారంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. గ్రామంలో మొత్తం 71 మందికి మందులు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మరో 24 మందికి లక్ష్మీపురం పిహెచ్‌సిలో చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షల నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఆసుపత్రికి వెళ్లి బాధితుల పరిస్థితిని చింతూరు ITDO PO, ASP, ఇతర అధికారులు తెలుసుకున్నారని, ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇద్దరు చనిపోయారనేది నిజం కాదని అధికారులు వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్ నుంచి ఇప్పటికే 9 మంది సభ్యుల వైద్య బృందాన్ని పంపించినట్లు తెలిపారు.

మరో మూడు ప్రత్యేక బృందాలు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ బయలుదేరినట్లు కలెక్టర్ దినేష్ వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సిఎం ఆదేశించారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు