AP: ఒకే గ్రామం.. 2 వర్గాలుగా విడిపోయి పిడకలతో సమరం.. ఎందుకంటే..?

|

Apr 02, 2022 | 6:55 PM

ఎన్నో యుద్ధాల్ని చూసుంటారు. వినుంటారు. లేటెస్ట్‌గా జరుగుతోన్న రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ మన కళ్ల ముందే ఉంది. కానీ, ఎప్పుడైనా పిడకల యుద్ధం చూశారా?

AP: ఒకే గ్రామం.. 2 వర్గాలుగా విడిపోయి పిడకలతో సమరం.. ఎందుకంటే..?
Pidakala Samaram
Follow us on

ఎన్నో యుద్ధాల్ని చూసుంటారు. వినుంటారు. లేటెస్ట్‌గా జరుగుతోన్న రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ మన కళ్ల ముందే ఉంది. కానీ, ఎప్పుడైనా పిడకల యుద్ధం చూశారా? ఒకేచోట ఉండేవాళ్లు రెండు శత్రు వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం చూశారా? ఈ పిడకల యుద్ధాన్ని చూడాలంటే కర్నూలు జిల్లాకు వెళ్లాల్సిందే. అవును, కర్నూలు జిల్లా(kurnool district)లో ఏటా పిడకల యుద్ధం జరుగుతుంది. ఆలూరు మండలం కైరుప్పల గ్రామంలో ప్రజలు, రెండు వర్గాలు విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. పిడకలే కదా అని లైట్‌ తీసుకోకండి. ఈ పిడకల యుద్ధంలో వందల మంది గాయపడతారు. ఆ రేంజ్‌లో జరుగుతుంది ఈ పిడకల యుద్ధం. ఎన్నో తరాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు కైరుప్పల గ్రామస్తులు. అంతేకాదు, ఈ పిడకల సమరం వెనక పెద్ద కథే ఉందంటారు. త్రేతాయుగంలో కాళికా మాతకు, వీరభద్రస్వామి మధ్య జరిగిన ప్రేమ, పెళ్లి గొడవే ఈ పిడకల యుద్ధం అంటారు. ఆనాడు కాళికా మాత, వీరభద్రస్వామి భక్తుల మధ్య జరిగిన పిడకల సమరాన్నే తాము కొనసాగిస్తున్నామని చెబుతున్నారు కైరుప్పల గ్రామస్తులు. ఆదివారం జరగనున్న ఈ పిడకల సమరం కోసం కైరుప్పల గ్రామస్తులు రెడీ అయ్యారు. ఈ పిడకల యుద్ధం తర్వాత కాళికా మాత, వీరభద్రస్వామికి కల్యాణం జరిపిస్తారు. అనంతరం, ఆలయంలో ఉన్న విభూతిని గాయాలకు రాసుకుంటారు గ్రామస్తులు. విభూతి రాసుకుంటే తమ గాయాలు నయం అవుతాయని వాళ్ల నమ్మకం.

 

Also Read: AP: రాత్రి పూట సైలెంట్‌గా ప్లాన్ చేశారు.. ఊహించని విధంగా చిక్కారు

Hyderabad Metro: మరింత వేగంగా ప్రయాణించనున్న హైదరాబాద్‌ మెట్రో రైళ్లు.. ప్రయాణ సమయం ఆదా