Pawan Kalyan vs YCP : పవన్ – వైసీపీ నేతల మధ్య ముదరుతున్న మాటల యుద్ధం.. మళ్లీ విరుచుకుపడిన పవర్ స్టార్..

|

Sep 28, 2021 | 10:49 AM

Andhra Pradesh: రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తున్నాయి.

Pawan Kalyan vs YCP : పవన్ - వైసీపీ నేతల మధ్య ముదరుతున్న మాటల యుద్ధం.. మళ్లీ విరుచుకుపడిన పవర్ స్టార్..
Pawan
Follow us on

Andhra Pradesh: రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగుతోంది. మంత్రులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. చిత్ర పరిశ్రమ, టికెట్ల పంపిణీ వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రుల తీవ్రంగా ఖండించారు. పవన్ విధానాలను తూర్పారబట్టారు. మంత్రులంతా సన్నాసులు అంటూ పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు.. మంత్రులు సైతం అంతే ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఆయన దోపిడీకి అడ్డంకిగా మారుతున్నాయి కాబట్టే అంతలా రియాక్ట్ అవుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

అయితే, వైసీపీ నేతలు చేస్తున్న మూకుమ్మడి కామెంట్స్‌పై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంతోపై మరోసారి విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పాలసీ ‘ఉగ్రవాదం’ అంటూ మండిపడ్డారు. ఈ విధానలతో రాష్ట్రంలోని అన్ని రంగాుల, వర్గాలు నాశనం అయిపోయాయని ఫైర్ అయ్యారు. ఈ ఉగ్రవాద పాలసీని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు. ఇక దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో మరి వేచి చూడాలి.

Pawan Kalyan Tweet:

Also read:

IPL Points Table 2021: టాప్ ప్లేస్‌ కోసం చెన్నై, ఢిల్లీ పోటీ.. ప్లే-ఆఫ్స్‌లో స్థానానికి ముంబై ఆరాటం..

PM Modi: రైతులకు నిజంగా శుభవార్త.. 35 రకాల పంటలను జాతీయం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ..

Telangana Govt Jobs: అంతకు మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యం కాదు.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..