AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రభుత్వ కేటాయింపులు వైసీపీ నేతల కమీషన్లకే సరిపోతున్నాయి.. నాదెండ్ల మనోహర్ ఘాటు వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు. రాష్ట్రంలోని గ్రామాలకు రోడ్లు నిర్మించేందుకు....

Andhra Pradesh: ప్రభుత్వ కేటాయింపులు వైసీపీ నేతల కమీషన్లకే సరిపోతున్నాయి.. నాదెండ్ల మనోహర్ ఘాటు వ్యాఖ్య
Janasena Nadendla Manohar
Ganesh Mudavath
|

Updated on: May 09, 2022 | 5:05 PM

Share

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు. రాష్ట్రంలోని గ్రామాలకు రోడ్లు నిర్మించేందుకు రూ.300 కోట్లు అవసరమైతే.. వైసీపీ ప్రభుత్వం మాత్రం రూ.26.50 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. ప్రభుత్వ కేటాయింపులు వైసీపీ(YCP) నేతల కమీషన్లకే సరిపోవడం లేదని ఆరోపించారు. రోడ్లు వేయలేని వాళ్లు రాజధాని ఎలా కడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలు, యువతులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మహిళలపై నేరాలు జరుగుతుంటే వాటికి తల్లుల పెంపకమే తప్పని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన దిశ చట్టం ఎటుపోయిందని, మహిళలకు రక్షణ కల్పించాలని నిరసనలు చేస్తుంటే వారిపై కేసులు ఎందుకు పెడుతున్నారని మండిపడ్డారు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలిపితే అడ్డుకోవడం భావ్యం కాదన్న నాదెండ్ల.. పోలీసులు అనుసరించిన వైఖరి అప్రజాస్వామికంగా ఉందని వ్యాఖ్యానించారు.

మరోవైపు.. గతంలో నంద్యాల జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ పొత్తుల విషయంపై కీలక ప్రకటన చేశారు. ప్రజల పక్షాన నిలబడి, వారికి సహాయం చేసేందుకు ముందుకు వస్తానని, అంతే తప్ప వ్యక్తిగతంగా లాభాపేక్ష పెట్టుకోనని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాట తాను తెచ్చుకున్నది కాదన్న జనసేనాని.. ఆలా అనడానికి వైసీపీ పాలనే కారణమని వివరించారు. వ్యతిరేక ఓటు చీలి వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత దిగజారిపోతుందని ఆవేదన చెందారు.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలన్న పవన్.. ఎవరెవరు కలిసొస్తారో తనాకూ తెలీదన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్‌కి ఎదురొడ్డి నిలిచాయని.. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనను సరిదిద్దాలంటే ఓటు చీలిపోకూడదని చెప్పారు. అదే జరిగితే ప్రజలకు ఇంకోసారి నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీచదవండి

Bangaluru: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మధ్యాహ్నం భోజనం చేశాక హాయిగా నిద్రపోవచ్చు

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ