సుదీర్ఘకాలంగా ఇరిగేషన్‌ శాఖలో పనిచేస్తున్న అధికారిని, ఇసుక లీలలు అన్నీఇన్నీ కావు..

|

Jun 16, 2022 | 12:50 PM

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో ఇసుక అక్రమ రవాణాకు ఇరిగేషన్ అధికారులు తెరలేపారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి చిత్రావతి నది లో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిగిపోయింది. గత 7 నెలలుగా ఇసుక రీచ్ మూతపడింది.

సుదీర్ఘకాలంగా ఇరిగేషన్‌ శాఖలో పనిచేస్తున్న అధికారిని, ఇసుక లీలలు అన్నీఇన్నీ కావు..
Atp
Follow us on

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో ఇసుక అక్రమ రవాణాకు ఇరిగేషన్ అధికారులు తెరలేపారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి చిత్రావతి నది లో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిగిపోయింది. గత 7 నెలలుగా ఇసుక రీచ్ మూతపడింది. అప్పటి నుంచి జిల్లాకేంద్ర వాసులు ఇసుక రీచ్ లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకుని వస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక కోసం నానా పాట్లు పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా నిబంధనలు కఠినంగా ఉండడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఎడ్లబండి పైన ఇసుక తీసుకు వస్తున్నా కూడా అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు ఇసుక దందాకు తెర లేపడం విమర్శలకు దారితీస్తోంది.

పట్టపగలే జెసిబి సహాయంతో ఇసుక అక్రమ రవాణాకు తెర లేపారు. ఈ తతంగమంతా జె ఈ జమునా భాయ్ కనుసన్నల్లో జరగడం గమనార్హం. ఇసుక మాఫియాతో జె ఈ జమునా భాయ్‌ జత కట్టినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇది ఏమని ఇరిగేషన్ జెఈ జమునాభాయ్ అడుగగా పర్మిషన్ అయితే లేదని , సొంత ఇంటి కోసం ఇసుక తోలుకుంటున్ననాని చెప్పడము ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సామాన్యులకు ఒక న్యాయం, అధికారులకు ఒక న్యాయమా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. చిత్రావతినదిలోకి మీడియా వెళ్లగా మీడియాతో మాట్లాడకుండా అటు నుంచి పలాయనం చిత్తగించారు. ఉన్నఫలంగా అక్కడ ఉన్న ట్రాక్టర్లు జెసిబి లు అన్నీ మీడియా ని చూసి జారుకున్నారు. అదే విధంగా చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఉన్న కంకర సైతం జమునా బాయి చెక్ డ్యామ్ నిర్మాణం కోసం ఉంచిన కంకర సైతం పట్టపగలే ఇరిగేషన్ జె ఈ జమునాభాయ్ ట్రాక్టర్ తో తరలించడం విమర్శలకు దారి తీస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ అధికారి అయి ఉండి ఇలా అక్రమాలకు పాల్పడటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేపట్టకూడదని ఓవైపు నిబంధనలు విధించి ఎడ్ల బండ్ల యజమానులకు ఆంక్షలు విధిస్తున్న అధికారులు దగ్గరుండి జెసిబి సాయంతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ తరలింపు చేపట్టడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న జె ఈ జమునాభాయ్ అవినీతి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇసుక దందా కొనసాగుతున్న సెబ్ అధికారులు సైతం చోద్యం చూస్తున్నారని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై స్పందించిన ఉన్నత అధికారులు ఇసుక తరలింపు పై ఆరా తీస్తున్నారు.