Vizag: సాగర గర్భంలో లెహరావో తిరంగా.. చూస్తే సలాం చేయాల్సిందే.!

| Edited By: Ravi Kiran

Aug 15, 2024 | 3:34 PM

దేశమంతా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. వాడ వాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. వేడుకలతో భారతజాతి పులకించిపోయింది. ఇంతటి మహత్తర రోజున..

Vizag: సాగర గర్భంలో లెహరావో తిరంగా.. చూస్తే సలాం చేయాల్సిందే.!
Independence Day
Follow us on

దేశమంతా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. వాడ వాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. వేడుకలతో భారతజాతి పులకించిపోయింది. ఇంతటి మహత్తర రోజున.. విశాఖ సాగరంలో మరో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. సాగర గర్భంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు నినదించారు స్కూబా డ్రైవర్లు. లెహెరావో తిరంగా అంటూ దేశభక్తి చాటుకున్నారు.

78వ స్వాతంత్ర దినోత్సవ వేళ.. 78 అడుగుల సముద్ర గర్భంలో..

విశాఖలో స్కూబా డ్రైవర్లు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. మువ్వనల జెండాను సముద్ర గర్భంలో ఆవిష్కరించారు. 78 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా.. 78 అడుగుల లోతు సముద్ర గర్భంలో జాతీయ జెండా నీటిలో రెపరెపలాడింది. మాజీ నేవి సబ్ మెరైనర్, స్కూబా ఇన్స్ట్రక్టర్ బలరాం నాయుడు నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం ఈ ఘనతను సాధించారు. ఋషికొండ తీరానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో.. వెళ్లి సముద్రంలో డైవ్ చేసి దేశభక్తిని చాటారు. లహరావో తిరంగా నినాదంతో.. ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేళ దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ విడుదల నుంచి సముద్రాన్ని కాపాడాలంటూ పిలుపునిచ్చారు. దాదాపు అరగంట పాటు సముద్రంలోనే జాతీయ జెండాతో ఉన్నారు.

ఇటీవల అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేళ .. 20 అడుగుల సముద్ర గర్భంలో లోతులో రాముడి చిత్రపటాన్ని ఆవిష్కరించి భక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా.. దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ అనే నినాదంతో.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మొత్తం కార్యక్రమానికి దాదాపు రెండు గంటల సమయం పట్టిందని.. సముద్రంలో అరగంట పాటు జాతీయ జెండా ప్రదర్శించామని బలరామ్ నాయుడు టీవీ9 కి వివరించారు. జాతీయ జెండాను తీసుకెళ్లడం సముద్రంలో 78 అడుగుల లోతులో ఆవిష్కరించడం తో పాటు.. అక్కడ వరకు స్కూ బా డైవింగ్ కిట్లతో వెళ్లి.. ఈ అద్భుత ఘట్టాన్ని కెమెరాలో షూట్ చేయడం మరో విశేషం.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..