AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: కార్లో వచ్చి దర్జాగా ఫ్లాట్‌లోకి వెళ్లాడు.. అంతే హుందాగా కిందకి వచ్చాడు.. కట్ చేస్తే..

కారులో అపార్ట్ మెంట్ కు వచ్చిన వ్యక్తి ప్లాట్ వద్దకు వెళ్లి ఎవరికి అనుమానం రాకుండా తాళాలు పగులకొట్టి ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో పదహారు సవర్ల బంగారు ఆభరణాలతో పాటు నగదు కూడా సర్ధుకొని తీసుకెళ్లాడు. అయితే వచ్చిన వ్యక్తికి ఇంట్లో ఎవరూ లేరని ముందే సమాచారం ఉందా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Guntur: కార్లో వచ్చి దర్జాగా ఫ్లాట్‌లోకి వెళ్లాడు.. అంతే హుందాగా కిందకి వచ్చాడు.. కట్ చేస్తే..
Thief
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 26, 2024 | 12:51 PM

Share

అది గుంటూరులోని శ్రీనివాసరావు పేట… ఎన్ ఎల్ ఆర్ అపార్ట్ మెంట్… మధ్యాహ్న సమయం…. ఒక కారు నేరుగా వచ్చి అపార్ట్ మెంట్ పార్కింగ్ వద్ద ఆగింది. అందులో నుండి టిప్ టాప్‌గా రెడి అయిన వ్యక్తి దిగాడు. నేరుగా లిఫ్ట్ లో పై అంతస్థుకి వెళ్లాడు. అతడి హుందాతనం చూసి ఎవరికీ ఎలాంటి డౌట్ రాలేదు. కొద్ది సేపటి తర్వాత ప్లాట్ నుండి కిందకు దిగి…. వచ్చిన కారులోనే అంతే దర్జాగా వెళ్లిపోయాడు. అయితే కొద్దిసేపటి తర్వాత ప్లాట్ తలుపులు తీసి ఉండటంతో అనుమానం వచ్చి యజమానలుకు చెప్పగా ఇంట్లో పదహారు లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, రెండున్నర లక్షల రూపాయల నగదు మాయమైనట్లు గుర్తించారు. వచ్చిన వ్యక్తి యజమాని కాదు దొంగ అన్న అనుమానం బలపడింది.

ఈ విషయాన్ని యజమాని పోలీసులకు చెప్పాడు. దీంతో వచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టగా ఇప్పటివరకూ ఎటువంటి ఆనవాళ్లు సేకరించలేకపోయారు. అయితే అపార్ట్ మెంట్ సిసి కెమెరా విజువల్స్ పరిశీలించగా వచ్చిన వ్యక్తే దొంగ అని రూడీ అయింది. గతంలోనూ కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలో యజమానిలా వచ్చి ఇంటి తాళాలు పగుల గొట్టి భారీగా బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ఘటన పోలీసులకు గుర్తుకొచ్చింది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

కారులో అపార్ట్ మెంట్ కు వచ్చిన వ్యక్తి ప్లాట్ వద్దకు వెళ్లి ఎవరికి అనుమానం రాకుండా తాళాలు పగులకొట్టి ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో పదహారు సవర్ల బంగారు ఆభరణాలతో పాటు నగదు కూడా సర్ధుకొని తీసుకెళ్లాడు. అయితే వచ్చిన వ్యక్తికి ఇంట్లో ఎవరూ లేరని ముందే సమాచారం ఉందా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరులో ఇటువంటి తరహా దొంగతనాలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఇంటిలో ఎవరూ లేకుండా ఊర్లకు వెళ్లినప్పుడు ఆ సమాచారాన్ని పోలీసులు ఇవ్వాలని సూచిస్తున్నారు. మొత్తం మీద సంచలనం రేపిన పట్టపగలు చోరి కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి