Andhra Pradesh: ఉద్యోగుల పనివేళల్లో మార్పులు.. తూర్పుగోదావరి జిల్లాలోనే ఆంక్షలు..
Employees Duty Timings: ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ వేళలు సడలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో కూడా మార్పులు చేస్తూ రాష్ట్ర

Employees Duty Timings: ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ వేళలు సడలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో కూడా మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉద్యోగుల పని వేళలను మార్పు చేస్తూ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్దాస్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనివేళలుగా నిర్ణయించారు. మిగిలిన ప్రాంతాల్లో కొవిడ్ ముందున్న సమయాల తరహాలోనే కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉద్యోగులకు పని వేళలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 30వ తేదీ వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. అన్ని శాఖల విభాగాధిపతులు, కలెక్టర్లు, ఈ ఆదేశాలు అమలు చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు జరగనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఈ నిబంధనలు ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి.
Also read:
