AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? వీళ్లు ఏం చేశారో తెలిస్తే మీ గుండె గుభేలే..

అనంతపురం జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల గోల్డ్‌ లోన్‌ మోసాలు కలకలం రేపుతున్నాయి. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. గోల్డ్‌ లోన్‌ మోసాల డొంక కదిలించారు. జల్సాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే బ్యాంకుల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు భారీ మోసానికి పాల్పడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Andhra: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? వీళ్లు ఏం చేశారో తెలిస్తే మీ గుండె గుభేలే..
Gold Loan
Shaik Madar Saheb
|

Updated on: Jul 29, 2025 | 10:33 AM

Share

అనంతపురం జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల గోల్డ్‌ లోన్‌ మోసాలు కలకలం రేపుతున్నాయి. జల్సాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే బ్యాంకుల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు భారీ మోసానికి పాల్పడ్డారు. రాంనగర్‌లోని ఓ బ్యాంకులో పనిచేసే వెంకటపల్లి సతీష్‌కుమార్‌.. పాత ఉద్యోగి జయరాములుతో కలిసి గోల్డ్ లోన్ మోసాలు చేశారు. బ్యాంకులో గోల్డ్‌ లోన్ తీసుకున్న వ్యక్తులు తాకట్టు పెట్టిన బంగారాన్ని.. ఆ బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియకుండా సుమారు రెండు కేజీల గోల్డ్‌ను చోరీ చేయడం సంచలన సృష్టించింది. కొందరు కస్టమర్లు బ్యాంకులో గోల్డ్‌ తనఖా పెట్టి లోన్లు తీసుకోగా.. ఆ గోల్డ్‌ను తీసుకెళ్లి మరో ప్రైవేట్ ఫైనాన్స్‌ సంస్థలో తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బులు తెచ్చుకున్నారు కొందరు వ్యక్తులు.

ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు ఉద్యోగి సతీష్‌కుమార్‌ ప్రధాన నిందితుడు కాగా.. మరో నలుగురు వ్యక్తులు అతని సహకరించారు. అందరూ కలిసి పనిచేస్తున్న బ్యాంకును బురిడీ కొట్టించారు. అయితే.. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం బ్యాంకులో లేకపోవడంతో గోల్డ్ లోన్ ఆఫీసర్ సతీష్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టురట్టు అయింది. బ్యాంకులో తాకట్టు పెట్టిన కస్టమర్లకు ఫోన్లు చేసి.. రెన్యువల్‌ చేసుకోవాలని పిలిపించిన నిందితులు..

రెన్యువల్ ఫామ్‌లపై సంతకాలు చేయించకుండా.. విత్‌డ్రా ఫామ్‌లపై సంతకాలు చేయించి మోసాలు చేశారని తెలిపారు అనంతపురం పోలీసులు. ఈ విధంగా గోల్డ్‌ను విత్‌ డ్రా చేసుకుని.. కీర్తన ఫైనాన్స్‌లో తనఖా పెడుతున్నారని వెల్లడించారు. టెక్నికల్‌ ఆధారాలతో కేసును చేధించిన పోలీసులు.. 50గ్రాముల బంగారంతోపాటు నాలుగు ఫోన్లు సీజ్‌ చేశారు. నిందితుల్లో A2 330 గ్రాములు, A3 కిలో 200గ్రాములు, A4 650 గ్రాముల బంగారం చోరీ చేసి.. కీర్తన ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టినట్లు తేలిందన్నారు అనంతపురం పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అన్నాడీఎంకే ‘అంతం’ ఆరంభమైందా..?
అన్నాడీఎంకే ‘అంతం’ ఆరంభమైందా..?
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.