చిత్తూరులో మరో దారుణం.. వివాహితపై గ్యాంగ్‌ రేప్‌

| Edited By:

Jan 01, 2020 | 9:54 AM

దిశ, నిర్భయ వంటి ఎన్ని కఠినమైన చట్టాలను తీసుకొస్తున్నా.. కామాంధుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. రోజు రోజుకూ మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా.. మరో అబలపై మృగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. చిత్తూరులోని ఓ వివాహితపై అత్యాచారానికి తెగబడ్డారు. నిమ్మనపల్లె మండలం చల్లవారిపల్లెలో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలిని బోయకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో.. పోలీసులు నిందితులైన […]

చిత్తూరులో మరో దారుణం.. వివాహితపై గ్యాంగ్‌ రేప్‌
Follow us on

దిశ, నిర్భయ వంటి ఎన్ని కఠినమైన చట్టాలను తీసుకొస్తున్నా.. కామాంధుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. రోజు రోజుకూ మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా.. మరో అబలపై మృగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. చిత్తూరులోని ఓ వివాహితపై అత్యాచారానికి తెగబడ్డారు. నిమ్మనపల్లె మండలం చల్లవారిపల్లెలో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలిని బోయకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో.. పోలీసులు నిందితులైన మహేష్, విజయ్, శివ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.