AP News: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీపై మాజీ మంత్రి జిల్లా అధికారులతో సమీక్ష..

| Edited By: Srikar T

Feb 11, 2024 | 2:10 PM

ఒంగోలులో 25 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే అవినీతికి పాల్పడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను అవినీతికి పాల్పడినట్టు తేలితే తనను చెప్పుతో కొట్టాలని ఆవేశంతో అన్నారు. అలాగే పేదలకు పట్టాలు పంపిణీ చేయకుండా ప్రయత్నిస్తే వారి సంగతి తేలుస్తానన్నారు.

AP News: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీపై మాజీ మంత్రి జిల్లా అధికారులతో సమీక్ష..
Former Minister Balineni Sr
Follow us on

ఒంగోలులో 25 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే అవినీతికి పాల్పడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను అవినీతికి పాల్పడినట్టు తేలితే తనను చెప్పుతో కొట్టాలని ఆవేశంతో అన్నారు. అలాగే పేదలకు పట్టాలు పంపిణీ చేయకుండా ప్రయత్నిస్తే వారి సంగతి తేలుస్తానన్నారు. ఒంగోలులో 231 కోట్లతో పేదలకు 25 వేల పట్టాలు పంపిణీ చేయడం కోసం అధికారులతో ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. అగ్రహారం దగ్గర లే అవుట్‌ను పరిశీలించారు.

పేదల పట్టాల పంపిణీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు పంపిణీ చేయలేకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని భీష్మించానని, తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నానని తెలిపారు. పట్టాలు పంపిణీ చేయడాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారి ఆఫీసును 75వేల మంది లబ్దిదారులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ఫర్వాలేదన్నారు. సీఎం ఊరుకున్నా, తాను ఊరుకోనని తెలిపారు. ఈనెల 20 నుంచి 25వ తేది లోపు సీఎం చేతుల మీదుగా 25 వేలమందికి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. పట్టాలతో పాటు ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గేటెడ్‌ కమ్మూనిటీ టౌన్‌ షిప్‌లా అభివృద్ది చేస్తామని బాలినేని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..