ఆన్లైన్ రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు కేవలం 45 పైసలకు రూ.10 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. చాలామంది ఈ ముఖ్యమైన ఆప్షన్ను నిర్లక్ష్యం చేస్తుంటారు. సాధారణంగా రూ.500 కన్నా ఎక్కువ ఖర్చయ్యే బీమాను, రైలు ప్రయాణికులు అతి తక్కువ ధరకే పొందే అవకాశం ఉంది. ప్రయాణంలో సురక్షితంగా ఉండేందుకు ఈ ఆప్షన్ను సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.