Andhra: మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.! రికవరీ చాలా ఈజీ..

ప్రజలు వివిధ కారణాలతో తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకోవడమో, లేక చోరీకి గురవడమో అయిన సందర్భాల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఇలా సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వాటిలో ఉండే విలువైన డేటాను కోల్పోయి అనేక ఇబ్బందులు..

Andhra: మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.! రికవరీ చాలా ఈజీ..

Edited By:

Updated on: Dec 24, 2025 | 2:48 PM

మీ సెల్‌ ఫోన్‌ ఎక్కడైనా పోగొట్టుకున్నారా.. లేదా చోరీకి గురైందా.. అయితే ఈ విధంగా చేయండి. మీ సెల్‌ఫోన్‌ ఎక్కడుందో కనిపెట్టి తీసుకొచ్చి మీ చేతిలో పెడతామంటున్నారు ప్రకాశంజిల్లా పోలీసులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గత ఐదేళ్ళకాలంలో 9 కోట్ల 50 లక్షల విలువైన సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అందించామని ప్రకాశంజిల్లా ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు తెలిపారు. తాజాగా రికవరీ చేసిన 50 లక్షల విలువైన 342 సెల్‌ఫోన్లను బాధితులకు అందించారు. తక్కువ ధరకే సెకెండ్‌ హ్యాండ్‌ సెల్‌పోన్లు ఇస్తామని ఎవరైనా చెబితే కొనవద్దని, వీటిలో చోరీకి గురైనవి ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.

సెల్‌ ఫోన్‌ పోతే వెంటనే ఏం చేయాలి..

ప్రజలు వివిధ కారణాలతో తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకోవడమో, లేక చోరీకి గురవడమో అయిన సందర్భాల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఇలా సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వాటిలో ఉండే విలువైన డేటాను కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే భావనతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ప్రత్యేక దృష్టి సారించారు. మిస్సింగ్ మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్ పోతే, వెంటనే మీ సిమ్‌ కార్డును బ్లాక్ చేయించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, గూగుల్‌ ఫైండ్‌ మై డివైస్‌ విధానంతో సెల్‌ ఫోన్లను లాక్‌ చేయడం, డేటాను ఎరేజ్ చేయడం, బ్యాంకింగ్ యాప్‌లు, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లు మార్చడం, అలాగే IMEI నంబర్‌తో CEIR పోర్టల్లో బ్లాక్ చేయడానికి ప్రయత్నించడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

సెల్‌ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లాలో పోలీసులు మొబైల్ ట్రేసింగ్ ద్వారా గత 3 నెలల్లో 50 లక్షల విలువైన 342 సెల్‌ఫోన్లను రికవరీ చేసి ఈరోజు బాధితులకు అందించారు. రికవరీలో యాపిల్, శాంసంగ్, వివో, రెడ్మి, ఒప్పో, వన్‌ తదితర కంపెనీలకు చెందిన మొత్తం 342 మొబైల్ ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి, ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో సంబంధిత యజమానులకు అందించారు.

ఐదేళ్ళలో 6, 776కు పైగా ఫోన్లు రికవరీ..

గత ఐదేళ్ళ నుంచి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో 9 కోట్ల 50 లక్షల విలువైన 6, 776 కు పైగా మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అందజేశారు. పోయిన తమ మొబైల్ ఫోన్లను పోలీసులు అత్యంత త్వరితగిన రికవరీ చేసి అందజేశారు. ఈ మొబైల్ ఫోన్లను మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గుర్తించి తిరిగి సేకరించారు. ఎవరైనా ఎక్కువ విలువ గల మొబైల్ ఫోన్లు తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ రూపంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తే, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి ఫోన్లను కొనవద్దని ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు సూచించారు. అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా మొబైల్ ఫోన్లు అమ్మడానికి వస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు… ఒకవేళ సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనాల్సిన పరిస్థితి వస్తే, తప్పనిసరిగా సక్రమమైన బిల్లును పరిశీలించి మాత్రమే కొనాలని సూచిస్తున్నారు… ఈరోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైందని, వాటిలో వ్యక్తిగత సమాచారంతో పాటు విలువైన డేటా నిల్వ ఉండటం వల్ల ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్‌పి సూచించారు. ఒకవేళ మీ సెల్ ఫోన్ ఎవరైనా అసాంఘిక వ్యక్తుల చేతికి చిక్కినట్లయితే, వారు ఆ ఫోన్‌ను ఉపయోగించి నేరాలకు పాల్పడే అవకాశముందని, అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు సూచిస్తున్నారు.