Andhra Pradesh: బంపర్‌ ఆఫర్‌.. అక్కడ మటన్‌ కేజీ 50 రూపాయలే.. ఎగబడ్డ స్థానికులు

అక్కడి నాన్‌వెజ్‌ ప్రియులకు బంపరాఫర్‌ దక్కింది. మాంసం ప్రియులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు వ్యాపారస్తులు.

Andhra Pradesh: బంపర్‌ ఆఫర్‌.. అక్కడ మటన్‌ కేజీ 50 రూపాయలే.. ఎగబడ్డ స్థానికులు
Mutton

Updated on: Dec 20, 2021 | 4:35 PM

అక్కడి నాన్‌వెజ్‌ ప్రియులకు బంపరాఫర్‌ దక్కింది. మాంసం ప్రియులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు వ్యాపారస్తులు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో మటన్‌ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీనికి వైరస్ లేదా మరేదైనా కారణం అనుకోకండి. వ్యాపారస్తుల మధ్య నెలకొన్ని పోటీ కస్టమర్లకు పండగలా మారింది. మటన్‌ షాప్‌ నిర్వాహకులు పోటీపడుతూ ధరలను తగ్గించారు. దీంతో మటన్ కేవలం 50 రూపాయలకు కిలో అమ్ముడు పోయింది. దీంతో కొనుగోలు దారులు పోటీపడుతూ.. ఒక్కొక్కరు ఐదు కిలోల నుంచి 10 కిలోల వరకు ఎగబడి మటన్ కొనుగోలు చేశారు. అందివచ్చిన అవకాశాన్ని.. ఒడిసిపట్టారు.

వాల్మీకిపురం గాంధీ బస్టాండు పక్కన మటన్‌ దుకాణాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ దుకాణ దారుడు కేవలం 300లకే మటన్ అమ్మడం మొదలుపెట్టాడు. దాంతో ఇతర షాపుల వారు పోటీతో… ఒకరి తర్వాత ఒకరు ధర తగ్గిస్తూ వచ్చారు. 300 నుంచి 200, 150, 100 నుంచి ఇలా చివరకు 50 తో స్థిరపడింది. దీంతో ఆదివారం సాయంత్రం 7 వరకు మటన్‌ షాపుల వద్ద గీరాకీ కొనసాగింది. ప్రజంట్ మార్కెట్‌లో కేజీ 700 నుంచి 800 వరకు రేటు పలుకుతుంది మటన్. పంతానికి, ప్రస్టేజ్‌కి పోయి పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయారు వ్యాపారులు. పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ ఇంత అతిగా కాదు అంటున్నారు  ఈ విషయం తెలిసిన జనాలు.

Also Read:  యూట్యూబ్‌లో చూస్తూ భార్యకు డెలివరీ.. చివరకు ఊహించని విషాదాంతం

పిల్లలు కలగలేదని ఇల్లాలికి బొడ్డుతాడు తినిపించారు..పాపం చివరికి