CPI Narayana: అంత అవసరం ఏమోచ్చింది.. సీఎం జగన్, చిరంజీవి భేటీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..

|

Jan 15, 2022 | 5:24 PM

CPI Narayana on Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అనంతరం ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చిరంజీవికి వైఎస్ఆర్‌సీపీ

CPI Narayana: అంత అవసరం ఏమోచ్చింది.. సీఎం జగన్, చిరంజీవి భేటీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..
Narayana
Follow us on

CPI Narayana on Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అనంతరం ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చిరంజీవికి వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. అంతేకాకుండా ప్రధానపార్టీలు సైతం పలు ఆరోపణలు చేసుకున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి (Chiranjeevi) సైతం స్పందించి.. ఆ వార్తలను ఖండించారు. తాను సీని పరిశ్రమ మేలు కోసం సీఎం జగన్ (CM YS Jagan)ను కలిసినట్లు పేర్కొన్నారు. కాగా.. చిరంజీవికి రాజ్యసభ సీటు వస్తుందన్న ఊహాగానాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మంచి మిత్రుడని.. కానీ ఒంటరిగా ముఖ్యమంత్రిని కలవడం ఆయన చేసిన పొరపాటని నారయణ స్పష్టంచేశారు. చిరంజీవి ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద వెళ్లి.. సీఎంను ఒంటరిగా కలవాల్సిన అవసరమేంటి. సమస్య సినీ పరిశ్రమదే తప్ప, వ్యక్తిగతంగా చిరంజీవిది కాదుగా అంటూ ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్, చిరంజీవి మధ్య రాజ్యసభ సీటు అంశం ప్రస్తావనకు వచ్చిందో లేదో కానీ వన్ టూ వన్ భేటీ ఇలాంటి ఊహాగానాలకు అవకాశమిచ్చిందంటూ నారాయణ తెలిపారు. ఇది సినీపరిశ్రమ సమస్య కాబట్టి ఆయా అసోసియేషన్లను వెంటబెట్టుకొని చిరంజీవి సీఎంను కలిసి ఉండాల్సిందని.. కానీ అలా చేయకుండా ఒంటరిగా వెళ్లారని నారాయణ పేర్కొన్నారు.

కాగా.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సొంత గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఆయనంబాకంలోని పొలంలో నారాయణ ట్రాక్టర్ నడిపారు. కోవిడ్ ప్రబలుతున్న ఈ సమయంలో సొంత గ్రామంలో ఉండడం క్షేమమని భావించి ఇక్కడే ఉన్నానంటూ నారాయణ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చిరంజీవిపై నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉంటే.. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చిరంజీవి కలవడాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) మండిపడ్డారు. సీఎంను చిరంజీవి కలిసింది కేవలం సినిమాకు సంబంధించిన పరిస్థితులు, ఇబ్బందులు వంటి అంశాలపై మాత్రమేనంటూ శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. చిరంజీవి అన్నదమ్ముల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొంతమంది అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారన్నారు.

Also Read:

Balineni Srinivasa Reddy: చిరంజీవి అందుకే సీఎంను కలిశారు.. చిచ్చు పెట్టేది చంద్రబాబే: మంత్రి బాలినేని

Viral video: కంగనా బుగ్గల కంటే సున్నితమైన రోడ్లను నిర్మిస్తాం.. వైరల్ గా మారిన జార్ఖండ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..