ఆఫీసుకొచ్చిన సిబ్బందికి గట్టి షాక్.. మెట్లపై దర్శనమిచ్చిన నాగుపాము.. ఎక్కడంటే.!

|

Aug 11, 2021 | 12:26 PM

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎంపీడీవో ఆఫీసులో నాగుపాము కలకలం సృష్టించింది. ఆఫీసులోని మెట్ల మార్గం గుండా ఓ నాగుపాము..

ఆఫీసుకొచ్చిన సిబ్బందికి గట్టి షాక్.. మెట్లపై దర్శనమిచ్చిన నాగుపాము.. ఎక్కడంటే.!
Snake
Follow us on

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎంపీడీవో ఆఫీసులో నాగుపాము కలకలం సృష్టించింది. ఆఫీసులోని మెట్ల మార్గం గుండా ఓ నాగుపాము సంచరిస్తుండంతో.. దానిని చూసి ఒక్కసారిగా సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. హుటాహుటిన బయటికి పరుగులు తీశారు. కాగా, ఆఫీసులో ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్రత కారణంగా పాములు సంచరిస్తున్నాయని ప్రజలు అంటున్నారు.

పాము కాటుతో గీత కార్మికుడు మృతి…

పాము కాటుతో ఒక గీత కార్మికుడు చనిపోయాడు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన మద్దుల రాజ్ కుమార్ అనే గీతా కార్మికుడు ఎప్పటిలాగే కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతోన్న క్రమంలో పాము కాటు వేసింది. దీంతో అతన్ని హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, రాజ్ కుమార్ పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్‌లోని పెద్దాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!

ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

8 పరుగులకే నాలుగు వికెట్లు.. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు ఖాతానే తెరవలేదు.. టీమిండియా వరస్ట్ రికార్డు