CM YS Jagan Review: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై సమీక్షించనున్నారు. అలాగే రాజధాని ప్రాంతంలో ఆగిపోయిన నిర్మాణాలపై సమీక్షించే అవకాశం ఉంది. గతంలో సింగపూర్ సిటీ ప్రాజెక్టు ఇచ్చిన రివర్ ఫ్రంట్ అభివృద్ధితో సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అవే కాకుండా పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.