AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విశాఖ నడిరోడ్డులో దారుణం.. స్కూటీపై వెళ్తున్న వివాహితపై కత్తితో దాడి..!

సింహాద్రిపురం దగ్గర స్కూటీపై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు మాస్క్ వేసుకుని వచ్చి తనను కత్తితో పొడిచారని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.

Andhra Pradesh: విశాఖ నడిరోడ్డులో దారుణం.. స్కూటీపై వెళ్తున్న వివాహితపై కత్తితో దాడి..!
Atrocious Attack In Visakha
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Sep 21, 2024 | 8:41 PM

Share

ప్రశాంతతకు మారుపేరైన విశాఖ నగరంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. వినాయక చవితి నిమజ్జనోత్సవంలో పాల్గొన్న కార్పెంటర్‌ను నడి రోడ్డుపైనే హత్య చేసిన ఘటన మరువక ముందే.. స్కూటీపై వెళ్తున్న మహిళను వెంబడించి మరీ హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు. స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్న ఆ మహిళ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది.

విశాఖ హెచ్‌బీ కాలనీలో పట్టపగలు కలకలం రేగింది. వివాహితపై దుండగులు కత్తితో దాడి చేశారు. మహిళ స్కూటీపై వెళ్తుండగా నడిరోడ్డు పై ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో తప్పించుకున్న మహిళ స్థానికులకు సమాచారం ఇచ్చింది. దీంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. మహిళకు నడుము భాగంలో గాయమైన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. స్కూటీపై వెళ్తుండగా దాడి చేసిన్నట్టు పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది ఆ బాధితురాలు.

ఇద్దరూ దుండగులు మాస్కులు వేసుకుని వచ్చి ఎటాక్ చేసినట్టు బాధితులు పోలీసులకు తెలిపింది. బాధితురాలి భర్త వస్త్ర వ్యాపారి. ముంబైకి వెళ్ళాడు. అతను లేని సమయంలో దుండగులు ఆమెపై దాడికి తెగబడ్డారు. కాగా, ఈ ఘటనకు సంంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..