
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు ఉపరితల ఆవర్తనం, మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, రాయలసీమలో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం మూడు రకాల వాతావరణ పరిస్థితులు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. దక్షిణ అంతర కర్ణాటక పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి ఉత్తర అంతర కర్ణాటక వరకు తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం ఈరోజు కొంత తగ్గింది.
ఇవాళ ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 40-60 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, ఈదురు గాలుల వేగం గంటకు 30-50 కి.మీ వరకు ఉంటుంది.
రాగల మూడు రోజులు ఇక్కడ వాతావరణం దాదాపు ఒకేలా ఉంటుంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. గంటకు 30-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.
ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఎల్లుండి కేవలం ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోయినప్పటికీ, ఆ తర్వాత 5 రోజుల్లో ఎండల తీవ్రత గణనీయంగా పెరగనుంది. వర్షాలు తగ్గగానే భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.