
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాబోవు మూడు రోజులు ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. నిన్నటి ఉత్తర ఛత్తీస్గఢ్ నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు వాయువ్య బీహార్ మరియు పరిసర ప్రాంతాల నుండి ఛత్తీస్గఢ్, తూర్పు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్-యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.
మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు ౩౦-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు ౩౦-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు ౩౦-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
గమనిక :- కోస్తా ఆంద్రప్రదేశ్, యానాం, రాయలసీమలో రాగాల 4 రోజుల్లో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణముతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రముముగా 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముంది తరువాత స్వల్పంగా తగ్గే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..