
ఏపీ పాలిసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ AP పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన వివరాలు అధికారిక వెబ్ సైట్ appolycet.nic.in లో చూసుకోవచ్చు. ర్యాంక్ హోల్డర్లందరికీ AP పాలిసెట్ ఫీజు చెల్లింపు సదుపాయం మే 24న ప్రారంభమవుతుందని తెలిపింది. మే 27 నుండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు పూర్తి షెడ్యూల్ను పైన పేర్కొన్న అధికారిక సైట్లో వెళ్లి చెక్ చేసుకోవచ్చు. AP POLYCETకు అర్హత పొందిన అభ్యర్థులు మే 31 నుండి కౌన్సెలింగ్ కోసం కళాశాలల ఎంపికలను భర్తీచేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన దరఖాస్తు ఫారం కూడా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే appolycet.nic.in.లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. AP POLYCET ర్యాంక్ హోల్డర్లు ఆన్లైన్ మోడ్ ద్వారా మే 24 నుంచి జూన్ 2 మధ్య ప్రాసెసింగ్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది.
షెడ్యూల్ చివరి రోజు అభ్యర్థి చివరిగా ఏ కళాశాలల ఎంపిక చేసుకుంటారో వాటిని స్థిరంగా ఉంచబడతాయని తెలిపింది. అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఆప్షన్లను పేపర్లో ప్రింట్ తీసుకుని కౌన్సిలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. షెడ్యూల్ వెలువడిన రోజు నుంచి ఎన్ని ఆప్షన్లు ఎంపిక చేసుకున్నా.. చివరి రోజున సర్వర్లో నమోదు అయిన కళాశాలలను మాత్రమే సీట్ల కేటాయింపు కోసం పరిగణించబడతాయని స్పష్టం చేసింది.
మరిన్ని విద్య, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..