ఏపీలో రహదారులకు మహర్దశ పట్టనుందా? ఇక రోడ్లపై వాహనాలు నిరాటంకంగా దూసుకుపోనున్నాయా ? తాజాగా రహదారులపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. రోడ్ల మరమ్మతుల కోసం అధికారులకు డెడ్లైన్ విధించారు. ఏపీలో రహదారుల దుస్ఠితిపై గత కొంతకాలంగా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు అనేకసార్లు ఆందోళన నిర్వహించారు. ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని ఆందోళనకు దిగారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దీనిపై స్పందించింది. రహదారుల రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం జగన్. దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇవి కూడా చదవండి: AP Municipal Elections 2021: ఏపీలో ముగిసిన మున్సిపల్ పోలింగ్.. కుప్పంలో టీడీపీ-వైసీపీ మధ్య హోరా హోరీ..
Home Loan: అతి తక్కువ వడ్డీకి హోం లోన్ కావాలా.. ఆ బ్యాంక్లో అదిరిపోయే బంపర్ ఆఫర్..