మీకో స్టోరీ చెబుతా వినండి. స్టోరీ కాదు.. రియల్ అండ్ హారిబుల్ ఇన్సిడెంట్. ఓ డాక్టర్.. తన దగ్గరికి వచ్చే పేషెంట్లకు మత్తు మందు ఇస్తున్నాడు. జబ్బు తగ్గించుకోడానికని వస్తుంటే.. ఆ మాయదారి వైద్యుడేమో ఇంకొన్ని జబ్బులు అంటిస్తున్నాడు. డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చిన తరువాతే ఆరోగ్యం పాడవడం గమనించిన ఓ పేషెంట్.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. జనరల్గా ఇలాంటి కేసులను అంత సీరియస్గా తీసుకోరనే అనుకుంటాం మనం. కాని, కూపీ లాగితే.. చాలా దారుణమైన విషయాలు తెలిశాయి. ఆ డాక్టర్ మెయిన్ టార్గెట్.. కేవలం జబ్బులు అంటించడం కాదు ఏకంగా ప్రాణాలు తీయడం అని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. ఇలా ఒక్కరినే టార్గెట్ చేయలేదు. మొత్తం ముగ్గురిని టార్గెట్ చేసి.. వాళ్లకి మార్ఫిన్ ఇంజక్షన్ ఎక్కించినట్టు తేలింది. ఓ డాక్టర్ ఎందుకని కిల్లర్గా మారాడని ఆరా తీస్తే.. రీజన్ ఆన్లైన్ బెట్టింగ్ అని తెలిసే సరికి పోలీసులు, బాధితులు నోరెళ్లబెట్టారు. పైగా ఎక్కడో విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో జరగలేదీ ఇన్సిడెంట్. ఏలూరులో జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు బానిసై.. లక్షలకు లక్షలు అప్పులు చేసి.. వాటిని తీర్చలేక అప్పులు ఇచ్చిన వారికే ఇంజక్షన్స్ ఇచ్చి చంపేయాలనుకున్నాడు. అది.. అలా ఉంటుంది బెట్టింగ్ మాయలో పడితే. భీమవరంలో రొయ్యల చెరువులు ఓనర్ అంటే.. ఒక ఊరునే కొనేంత స్థితిమంతుడు అని అంటుంటారు. రొయ్యల చెరువులతో బాగా సంపాదించి శభాష్ అనిపించుకున్న ఓ కుర్రాడు.. క్రికెట్ బెట్టింగ్కు...