నివర్‌ తుపానుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష .. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి

|

Nov 26, 2020 | 9:03 AM

నివర్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకారణంగా జనజీవనం స్తంభించిపోయింది. తుఫాన్ ప్రభావంతో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

నివర్‌ తుపానుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష .. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి
Follow us on

నివర్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకారణంగా జనజీవనం స్తంభించిపోయింది. తుఫాన్ ప్రభావంతో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. చిత్తూరు , నెల్లూరు ,కర్నూలు ,ప్రకాశం , వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు  కురుస్తున్నాయి. నివర్‌ తుపానుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌, ఉన్నతాధికారుల తుఫాన్ సహాయక చర్యలు బాగా తీసుకుంటున్నారని ప్రశంసించారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 700 కుటుంబాలను ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. పంట నష్టం పెద్దగా లేకపోవడం అదృష్టం అన్నారు. చెరువుల విషయంలో నీటిపారుదల అధికారులు జాగ్రతగా ఉండాలని.. తీరప్రాంతంలో ఉన్న స్పెషల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాలు, నిత్యావసరలు కు ఇబ్బంది కలగకుండా చూస్తున్నమన్నారు. ఈరోజు, రేపు రెండు రోజులు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. బయట తిరగకుండ జాగ్రత్తగా ఉండాలని..చెరువుల దగ్గర ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సూచించారు.