భర్తపై భార్యకు కోపం.. పెద్దలు పంచాయితీ చేసి కాపురానికి పంపగా ఏంచేసిందో తెలుసా..

| Edited By: Srikar T

Apr 01, 2024 | 11:50 AM

భార్యభర్తల మధ్య సఖ్యత లేదు. ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం వాళ్లిద్దరూ కలిసే ఉండాలనుకున్నారు. చివరికి ఆమె మాత్రం అతని నుండి దూరంగా ఉండేందుకే ప్రయత్నం చేసింది. అతనిది ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం. పేరు ప్రభుదాసు.

భర్తపై భార్యకు కోపం.. పెద్దలు పంచాయితీ చేసి కాపురానికి పంపగా ఏంచేసిందో తెలుసా..
Wife Kills Husband
Follow us on

భార్యభర్తల మధ్య సఖ్యత లేదు. ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం వాళ్లిద్దరూ కలిసే ఉండాలనుకున్నారు. చివరికి ఆమె మాత్రం అతని నుండి దూరంగా ఉండేందుకే ప్రయత్నం చేసింది. అతనిది ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం. పేరు ప్రభుదాసు. వాయిదాలపై చిన్న చిన్న వస్తువలను ఇచ్చి ఇన్ స్టాల్ మెంట్స్ కట్టించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి అనూషతో వివాహంమైంది. కొద్దీ రోజులు ఇద్దరూ బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభుదాసు వినుకొండ వచ్చాడు. హనుమాన్ నగర్‎లో నివాసం ఉంటున్నాడు. అక్కడ కూడా వాయిదాలపై చిన్న చిన్న వస్తువులను విక్రయించడం చేస్తున్నాడు. అయితే అనూష తల్లిదండ్రులు సుబ్బారావు, అంకమ్మ.. ప్రభుదాసు వద్దకు వచ్చి పెద్ద మనుషులతో కలిసి పంచాయితీ పెట్టారు.

ప్రభుదాసు, అనూషాలు కలిసే ఉండాలని నిర్ణయించారు. దీంతో ప్రభుదాసు కూడా ఆమెను కాపురానికి తీసుకెళ్లడానికి ఇష్టపడ్డాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం అనూష వినుకొండలోని భర్త ప్రభుదాసు ఇంటికి వచ్చింది. అంత వరకూ బాగానే ఉంది. వారం రోజులుగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే నిన్న ఉదయం ప్రభుదాసు ఇంటిలో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో అనూష వేడి వేడి నీళ్లను తీసుకొచ్చి ప్రభుదాసు మర్మాంగంపై పోసింది. దీంతో తీవ్ర గాయాలైన ప్రభుదాసును వినుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. అనూష తన తల్లిదండ్రులైన సుబ్బారావు, అంకమ్మలతో కలిసి తనపై హత్యాయత్నానికి పాల్పడిందని ప్రభుదాసు ఆరోపించాడు. తీవ్ర గాయాలైన ప్రభుదాసుకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.