Road Accident: అమెరికా రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏపీ మహిళ మృతి.. రెండ్రోజుల వ్యవధిలోనే తల్లీకూతురు!

|

Apr 02, 2024 | 4:32 PM

అమెరికాలోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు కారులో గుడికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా.. బాలిక తల్లి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో సోమవారం (ఏప్రిల్‌ 1) మృతి చెందింది. వివరాల్లోకెళ్తే..

Road Accident: అమెరికా రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏపీ మహిళ మృతి.. రెండ్రోజుల వ్యవధిలోనే తల్లీకూతురు!
Andra Pradesh Woman In America
Follow us on

కొణకంచి, ఏప్రిల్‌ 2: అమెరికాలోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు కారులో గుడికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా.. బాలిక తల్లి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో సోమవారం (ఏప్రిల్‌ 1) మృతి చెందింది. వివరాల్లోకెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామనికి చెందిన కమతం గీతాంజలి (32) భర్త, పిల్లలతో అమెరికాలో ఉంటోంది. ఆదివారం గీతాంజలి పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో సహా అందరూ కారులో గుడికి వెళ్లారు. అనంతరం గుడి నుంచి తిరిగి వస్తుండగా వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక బ్రెయిన్‌ డెడ్‌ అయి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాల పాలైన గీతాంజలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన భర్త నరేష్‌, కుమారుడు బ్రమణ్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెలు రెండు రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. హానిక, గీతాంజలి మృతదేహాలను స్వగ్రామం ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని కొణకంచి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.