Andhra Pradesh: తెల్ల చొక్కాలు తిసేస్తే మేమూ రౌడీలమే.. గంటల సమయంలోనే అంటూ..

|

Jun 28, 2022 | 1:54 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం పీక్స్‌కు చేరుతోంది. నేతల మాటలు తూటాళ్లా పేలుతున్నాయి. పరుస్పర దుషణలతో రాజకీయం హీటెక్కుతోంది.

Andhra Pradesh: తెల్ల చొక్కాలు తిసేస్తే మేమూ రౌడీలమే.. గంటల సమయంలోనే అంటూ..
Brahmi Reddy
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం పీక్స్‌కు చేరుతోంది. నేతల మాటలు తూటాళ్లా పేలుతున్నాయి. పరుస్పర దుషణలతో రాజకీయం హీటెక్కుతోంది. తాజాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ ఇంచార్జ్ బ్రహ్మారెడ్డి తీవ్రమైన కామెంట్స్ చేశారు. తెల్ల చొక్కాలు తీసేస్తే తామూ రౌడీలమే అని అన్న ఆయన.. గంటల సమయంలోనే చంపేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. తమ రాజకీయ గురువులు కొన్ని విలువలు నేర్పారని, వాటికి కట్టుబడి ఉన్నామన్నారు. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తానంటూ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బ్రహ్మిరెడ్డి. దమ్ముంటే గ్రామాలను అభివృద్ధి చేయాలని హితవుచెప్పారు.

యరపతినేనిపై పిన్నెల్లి ఫైర్..
ఇదిలాఉంటే.. మాచర్ల నియోజకవర్గం ప్లీనరీ సమావేశంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై ఎమ్మెల్యే పిన్నెల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబం గురించి, సీఎం జగన్ గురించి మాట్లాడితే నాలుక కోస్తాననంటూ యరపతినేనికి వార్నింగ్ ఇచ్చారు. ఆయన్ను నియోజకవర్గంలో తిరగనివ్వనని అన్నారు. ‘నీ ఉడుత ఊపులకు భయపడను. నీ జీవితాంతం నన్ను టచ్‌ కూడా చేయలేవు. పుస్తకం కాదు పెద్ద గ్రంధమే రాసుకో. భయపడేదే లేదు.’ అని యరపతినేనిపై విరుచుకుపడ్డారు పిన్నెల్లి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..