Andhra Pradesh: పొన్నూరులో పొలిటికల్‌ వార్‌.. మంత్రి సిదిరి, ధూళిపాళ్ల మధ్య మాటల యుద్ధం..

చంద్రబాబునాయుడు ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో సహకార సంఘాల్లో ఉన్న పాల డెయిరీలను తన వాళ్లకు కట్టబెట్టాడని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు.

Andhra Pradesh: పొన్నూరులో పొలిటికల్‌ వార్‌.. మంత్రి సిదిరి, ధూళిపాళ్ల మధ్య మాటల యుద్ధం..
Ponnur Politics

Updated on: Dec 15, 2022 | 7:22 AM

చంద్రబాబునాయుడు ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో సహకార సంఘాల్లో ఉన్న పాల డెయిరీలను తన వాళ్లకు కట్టబెట్టాడని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగం డెయిరీ ప్రభుత్వం​ఆస్తి.. అది ప్రజల సొత్తు అని చెప్పారు. ఏ రోజుకైనా సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబు పిచ్చెక్కిందని విమర్శించారు. ఎన్నికల సమయానికి చంద్రబాబు పిచ్చి ఏ స్థాయికి వెళ్తుందో అర్థం కావట్లేదంటూ తెలిపారు. గతంలో చేసిన పాపాలతో ఇదే కర్మ రా బాబు అని చంద్రబాబు రోడ్ల వెంబడి తిరుగుతున్నాడంటూ మంత్రి సిదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు.

కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ కౌంటరిచ్చారు. సిదిరి అప్పలరాజు పశువుల శాఖా మంత్రిగా ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. సహకార చట్టం గురించి కనీసమైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. పశువులకంటే హీనంగా సిదిరి అప్పలరాజు పరిస్థితి ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా పశువులు మృతి చెందాయి. మృతి చెందిన పశువులకు డబ్బులు ఇవ్వడం చేతకాక మంత్రి ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.

కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని అమూల్ కోసం ఖర్చు పెడుతూ పశువుల మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో డెయిరీ ఆస్తి 400 కోట్ల విలువ చేసే భూములను అమూల్ డెయిరీ కోసం దారాదత్తం చేస్తున్నారని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us