AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో 2 నెలల్లో ఇంటింటికి తాగునీరు.. మారుమూల గ్రామాలకూ కొత్త రోడ్లు

డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతంం కొత్త రోడ్లు నిర్మించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. మరో రెండు నెలల్లో ప్యాపిలి మండలంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ప్యాపిలి ప్రారంభోత్సవాల పర్యటనలో భాగంగా మునిమడుగు గ్రామానికి చేరుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్థానిక జనం ఘన స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పాదయాత్ర చేపట్టారు.

మరో 2 నెలల్లో ఇంటింటికి తాగునీరు.. మారుమూల గ్రామాలకూ కొత్త రోడ్లు
Buggana Rajendranath
Balaraju Goud
|

Updated on: Oct 17, 2023 | 2:39 PM

Share

డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతంం కొత్త రోడ్లు నిర్మించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. మరో రెండు నెలల్లో ప్యాపిలి మండలంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ప్యాపిలిలోని రూ.5.5 కోట్లతో నిర్మించిన సరికొత్త రహదారులను ఆయన మంగళవారం ప్రారంభించారు. గార్లదిన్నె నుంచి అలేబాదు వరకు రూ.3 కోట్ల నిధులతో 4 కి.మీ మేర కొత్త రోడ్డుకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు. మునిమడుగు నుంచి అలేబాదు తండా వరకు రూ.2.5కోట్లతో 5 కి.మీ మేర నూతన రహదారిపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాదయాత్ర చేస్తూ ముందుకు సాగారు బుగ్గన.

ప్యాపిలి ప్రారంభోత్సవాల పర్యటనలో భాగంగా మునిమడుగు గ్రామానికి చేరుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్థానిక జనం ఘన స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పాదయాత్ర చేపట్టారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గార్ల దిన్నె, మునిమడుగు, అలేబాదు, అలేబాదు తాండ ప్రజలతో కలిసి నడుస్తూ ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

డోన్ నియోజకవర్గం వ్యాప్తంగా నీటి సమస్య త్వరలోనే తొలగిపోతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భరోసా ఇచ్చారు. వర్షం వచ్చినా రాకున్నాఇబ్బంది కలగని విధంగా డిసెంబర్ కల్లా పైప్ లైన్ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ప్యాపిలిలో ఇంటింటికి పుష్కలంగా తాగునీరు అందిస్తామన్నారు. అలేబాద్ గ్రామంలోని సింగిల్ విండో ఛైర్మన్ బాలయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఇడ్లీ పిండితోనూ క్రిస్పీ ఎగ్ పకోడా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
ఇడ్లీ పిండితోనూ క్రిస్పీ ఎగ్ పకోడా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి..లేదంటే అయిపోతారు
కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి..లేదంటే అయిపోతారు
ఏపీలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమం
ఏపీలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమం
PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు..
PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు..
ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్
ఆహా.. ఏమి అందం! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము..ఏం చేసిందంటే
ఆహా.. ఏమి అందం! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము..ఏం చేసిందంటే
తొలి ట్రోఫీ కోసం మాజీ ఛాంపియన్‌తో పోటీకి సిద్ధమైన ఢిల్లీ..
తొలి ట్రోఫీ కోసం మాజీ ఛాంపియన్‌తో పోటీకి సిద్ధమైన ఢిల్లీ..
రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. అకౌంట్లోకి అప్పుడే..
రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. అకౌంట్లోకి అప్పుడే..
మ్యాచ్ గెలిచినా.. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఓటమే..
మ్యాచ్ గెలిచినా.. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఓటమే..