Chandrababu Naidu: రేపటి నుంచి రెండు రోజులపాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పాటు తన సొంత నియోజక వర్గంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి రెండురోజుల..

Chandrababu Naidu: రేపటి నుంచి రెండు రోజులపాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు
Chandrababu

Updated on: Oct 28, 2021 | 7:40 AM

Chandrababu Naidu: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పాటు తన సొంత నియోజక వర్గంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి రెండురోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. రేపు కుప్పంలో జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం 30న కుప్పంలో పలు గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు. కుప్పంలో రెండు రోజులు చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో.. గత పది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్యా ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని ఇవ్వడానికి చంద్రబాబు కుప్పం పర్యటన చేపట్టినట్లు టీడీపీ శ్రేణులు చెప్పారు.  ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ పరాజయం పాలైన నేపథ్యంలో.. గ్రామస్థాయి పార్టీ కేడర్ లో నూతన ఉత్తేజం నింపేందుకు చంద్రబాబు ఈ పర్యటన చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఏపీలో అధికార పార్టీ వైఖరిపై ఇప్పటికే ఢిల్లీ వేదికగా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని పెద్దలను కలిసి.. అధికార పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న సంగతి తెలిసిందే..

Also Read:

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. 1968 ఖాళీలు..

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

ఈరోజు ఈ రాశివారికి వాహన కొనుగోలు చేసే అవకాశం.. ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us