ఏపీ లిక్కర్ కేసులో ఊహించని పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న అధికారులు.. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే ఈ కేసులో కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ కాగా.. తాజాగా మాజీ మంత్రి అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ ట్రాన్స్ పోర్ట్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో ED అధికారులు కారుమూరి వెంకట నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసుకు పోలీసులు తరలిస్తున్నారు. కాగా.. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే.. ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో.. కారుమూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
దర్యాప్తు ముమ్మరం..
కాగా.. ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసును ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. టెండర్లలో అక్రమాలు, నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు.. అరెస్టైన వారిలో వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డి, కారుమూరి కుమారుడు సునీల్కుమార్ ఉన్నారు. టెండర్లలో సిగ్మా సప్లయ్ చైన్ సొల్యూషన్స్ను ఫ్రంట్ కంపెనీగా ఉపయోగించినట్టు ఈడీ అనుమానిస్తోంది.. హవాలా లావాదేవీలపై కూడా ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
