ఫ్యామిలీతో జగన్ జెరూసలేం ట్రిప్..షెడ్యూల్ ఫిక్స్!

|

Jul 28, 2019 | 2:57 PM

అమరావతి:  ముఖ్యమంత్రిగా భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బిజీ బిజీ షెడ్యూల్స్‌లో తీరికలేకుండా గడుపుతోన్న జగన్ లిటిల్ బ్రేక్ తీసుకోనున్నారు. ఆయన ఫ్యామిలీతో కలిసి జెరూసలేం వెకేషన్‌కి వెళ్లనున్నారు.  ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ ఇజ్రాయెల్‌లో సాగనున్న ఈ పర్యటనలో..  కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. సీఎం పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్ జోషి, ఎస్‌ఎస్‌జి ఎస్పీ సెంథిల్ కుమర్ కూడా సీఎంతో వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్‌) […]

ఫ్యామిలీతో జగన్ జెరూసలేం ట్రిప్..షెడ్యూల్ ఫిక్స్!
Follow us on

అమరావతి:  ముఖ్యమంత్రిగా భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బిజీ బిజీ షెడ్యూల్స్‌లో తీరికలేకుండా గడుపుతోన్న జగన్ లిటిల్ బ్రేక్ తీసుకోనున్నారు. ఆయన ఫ్యామిలీతో కలిసి జెరూసలేం వెకేషన్‌కి వెళ్లనున్నారు.  ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ ఇజ్రాయెల్‌లో సాగనున్న ఈ పర్యటనలో..  కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. సీఎం పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్ జోషి, ఎస్‌ఎస్‌జి ఎస్పీ సెంథిల్ కుమర్ కూడా సీఎంతో వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్‌) విభాగం ఉత్తర్వులను జారీ చేసింది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటన అని, అందుకు అయ్యే వ్యయం కూడా ఆయనే భరిస్తారని జీవోలో పేర్కొన్నారు.