టీడీపీ నేతలకు మంత్రి అనిల్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్

| Edited By:

Jan 08, 2020 | 1:19 AM

ఏపీలో రాజధానుల అంశం పార్టీల మధ్య మాటలయుద్ధానికి దారితీస్తోంది. గత కొద్ది రోజుల నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ.. అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాడు.. రైతులు చేపట్టిన రాస్తారోకో.. వివాదానికి తెరలేపింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై ఆందోళన చేస్తున్న రైతులు దాడికి దిగారు. దీంతో ఈ దాడికి రాజకీయ రంగు అంటుకుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో పిన్నెల్లి […]

టీడీపీ నేతలకు మంత్రి అనిల్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్
Follow us on

ఏపీలో రాజధానుల అంశం పార్టీల మధ్య మాటలయుద్ధానికి దారితీస్తోంది. గత కొద్ది రోజుల నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ.. అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాడు.. రైతులు చేపట్టిన రాస్తారోకో.. వివాదానికి తెరలేపింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై ఆందోళన చేస్తున్న రైతులు దాడికి దిగారు. దీంతో ఈ దాడికి రాజకీయ రంగు అంటుకుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై జరిగిన దాడిని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు.. టీడీపీ అగ్రనేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైతుల ముసుగులో టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని.. తాము కూడా ఎదురు దాడులకు దిగితే.. పరిస్థితి ఎలా ఉంటుందో  ఊహించుకోవాలని.. టీడీపీ అధినేతతోపాటు ఎవరూ కూడా బయట తిరగలేరని అన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అందుకే రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.