చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారు : హోంమంత్రి సుచరిత

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. బస్సుయాత్రకు అనుమతిచ్చిన మార్గంలో కాకుండా.. మరో మార్గంలో యాత్రను కొనసాగించినందువల్లే పోలీసులు అడ్డుకున్నారన్నారు. గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగినా.. వైసీపీ సంయమనం పాటించిందన్నారు. కానీ రైతుల సహజ మరణాలను సైతం.. రాజధాని కోసమే అంటూ చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం పది మంది రైతులు చనిపోయినట్లు చంద్రబాబు […]

చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారు : హోంమంత్రి సుచరిత
Follow us

| Edited By:

Updated on: Jan 09, 2020 | 6:12 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. బస్సుయాత్రకు అనుమతిచ్చిన మార్గంలో కాకుండా.. మరో మార్గంలో యాత్రను కొనసాగించినందువల్లే పోలీసులు అడ్డుకున్నారన్నారు. గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగినా.. వైసీపీ సంయమనం పాటించిందన్నారు. కానీ రైతుల సహజ మరణాలను సైతం.. రాజధాని కోసమే అంటూ చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం పది మంది రైతులు చనిపోయినట్లు చంద్రబాబు చెప్తున్నారని.. కానీ వారంతా గుండెపోటుతో మరణించినట్లు రికార్డులున్నాయన్నారు.

రైతుల భూములను గత ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తామన్నారో.. అదే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు హెంశాఖ మంత్రి సుచరిత. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేస్తామని.. ప్రస్తుతం ఏ ఏ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై చర్చలు మాత్రమే జరుగుతున్నాయన్నారు.