CM YS Jagan: పేదలకు మంచి చేయడం తప్పా.? సినిమా టికెట్ల తగ్గింపుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

|

Jan 01, 2022 | 1:38 PM

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ.. ఎన్ని అడ్డంకులు వచ్చిన దాటుకుంటూ ముందుకు...

CM YS Jagan: పేదలకు మంచి చేయడం తప్పా.? సినిమా టికెట్ల తగ్గింపుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
Cm Jagan
Follow us on

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ.. ఎన్ని అడ్డంకులు వచ్చిన దాటుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడులో ఆయన వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ అవ్వాతాతలకు పించన్‌ను రూ. 2,500కు పెంచుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

కులమతాలకు అతీతంగా పాలన సాగిస్తూ అర్హులైన వారందరికీ పెన్షన్ అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పేదలకు మంచి చేస్తుంటే కొందరు విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా అడ్డుపడ్డారని.. సామాన్యులకు వినోదం అందుబాటులో ఉండేందుకు సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తే.. దానికి కూడా విమర్శలు గుప్పిస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీఎస్ పధకం విషయంలోనూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఇవాళ జరిగిన పించన్ల పెంపు కార్యక్రమంలో సీఎం జగన్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.