నేటి రెండు విడతలుగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్ననికి ఉభయ సభలూ వాయిదా పడనున్నాయి. అనంతరం నేరుగా రాజ్ భవన్కు సీఎం జగన్ చేరుకుంటారు. రాజ్భవన్లో జరగనున్న గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీలు హాజరుకానున్నారు. గవర్నర్ ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం నుంచి ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.