AIIMS Jobs 2025: పదో తరగతి, ఇంటర్‌ అర్హతతో.. ఎయిమ్స్‌లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! ఎంపిక ఇలా..

AIIMS DELHI CRE Recruitment 2025 notification: దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ హాస్పిటల్స్‌, కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో రెగ్యులర్‌ ప్రాతిపదికన భారీగా గ్రూప్‌-బీ, సీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తుఉల కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1,383 ఉద్యోగాలను భర్తీ..

AIIMS Jobs 2025: పదో తరగతి, ఇంటర్‌ అర్హతతో.. ఎయిమ్స్‌లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! ఎంపిక ఇలా..
AIIMS CRE Recruitment 2025 Notification

Updated on: Nov 16, 2025 | 8:17 AM

న్యూ ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (AIIMS).. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ హాస్పిటల్స్‌, కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో రెగ్యులర్‌ ప్రాతిపదికన భారీగా గ్రూప్‌-బీ, సీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తుఉల కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1,383 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 డిసెంబర్‌ 2వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇవే..

  • అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 121
  • అసిస్టెంట్‌ స్టోర్స్‌ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 102
  • ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-2/టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 80
  • జూనియ్ స్కేల్ స్టెనో(హిందీ) పోస్టుల సంఖ్య: 71
  • టెక్నీషియన్‌ (రేడియాలజీ) పోస్టుల సంఖ్య: 105
  • సీనియర్ నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 121
  • ఫిజియోథెరపిస్ట్‌/జూనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌ పోస్టుల సంఖ్య: 46
  • సానిటరీ ఇన్‌స్పెక్టర్‌/సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జీడీ పోస్టుల సంఖ్య: 33
  • ఫార్మసిస్ట్‌/ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టుల సంఖ్య: 35
  • అసిస్టెంట్‌ డైటీషియన్‌ పోస్టుల సంఖ్య: 17

సంబంధిత పోస్టులను అనుసరించి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్‌ విధానంలో గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,400 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.