Andhra Pradesh: అనుమానం పెను భూతం.. ఆరేళ్ల కన్న కూతురిని పొట్టనబెట్టుకున్న కసాయి తండ్రి..!

| Edited By: Balaraju Goud

Jun 22, 2024 | 11:51 AM

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురుని కడతేర్చాడు. భార్యపై అనుమానంతో కన్న కూతురిని కడతేర్చాడు ఓ కసాయి. అనంతపురం జిల్లా నార్పలలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మానవత్వం మంట కలిసిన సంఘటన మూడు రోజుల క్రితం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: అనుమానం పెను భూతం.. ఆరేళ్ల కన్న కూతురిని పొట్టనబెట్టుకున్న కసాయి తండ్రి..!
Ap Crime News
Follow us on

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురుని కడతేర్చాడు. భార్యపై అనుమానంతో కన్న కూతురిని కడతేర్చాడు ఓ కసాయి. అనంతపురం జిల్లా నార్పలలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మానవత్వం మంట కలిసిన సంఘటన మూడు రోజుల క్రితం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారి పావని ఇంటికి రాకపోవడంతో తండ్రి గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న నార్పల పోలీసులు విచారణ చేపట్టారు.

మూడు రోజుల నుంచి పోలీసులు విచారణ జరిపినా.. చిన్నారి ఆచూకీ తెలియలేదు. పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఒక పాడుబడిన బావిలో చిన్నారి పావని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. చిన్నారిని ఎవరు హత్య చేశారో తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. కన్న తండ్రి కసాయిగా కూతురిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మూడు రోజుల నుంచి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసినా లాభం లేకపోవడంతో.. చివరగా తండ్రి గణేష్ పై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో తండ్రి గణేష్ పోలీసులకు అసలు బండారం బయటపడింది.

తన భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో కూతురిని హత్య చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్నాడు. ఆరేళ్ల చిన్నారి పావని తనకు పుట్టలేదు అన్న అనుమానంతోనే, భార్య అమలపై కక్ష పెంచుకుని కూతురుని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నార్పల పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న పాడుబడిన బావిలో ఆరేళ్ల చిన్నారిని పడేయడంతో.. నీటిలో మునిగి ఊపిరాడక చిన్నారి పావని చనిపోయింది. ఆరేళ్ల కూతురి పావని విషయంలో తరచు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని స్థానికులు పోలీసులకు తెలిపారు.

ఈ క్రమంలోనే తండ్రి గణేష్ భార్య అమలపై అక్రమ సంబంధం అనుమానంతో కూతురు పావనిని కడతేర్చాడు. చిన్నారి పావని హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కసాయిగా మారి కూతురిని హత్య చేయడాన్ని స్థానికులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..