Nirav Modi File: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కుంటున్న నీరవ్ మోదీని భారత్కు అప్పగించడంపై యూకే కోర్టు గురువారం తీర్పును వెలువరించనుంది. ప్రస్తుతం నీరవ్ మోదీ లండన్ జైలులో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ లండన్లోని వాండ్స్వర్త్ జైలు నుంచి వర్చువల్గా వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో నీరవ్ మోదీని పోలీసులు హాజరుపరచనున్నారు.
నీరవ్ మోదీ ఎక్స్ట్రాడిషన్ కేసుపై యూకే మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మేజిస్ట్రేట్ కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నివేదికపై యూకే హోంమంత్రి ప్రీతీ పటేల్ సంతకం చేయనున్నారు. అయితే కోర్టు ఇచ్చే తీర్పుపై నీరవ్ మోదీ పిటీషన్ వేసే అవకాశం లేకపోలేదు. ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేయవచ్చు. కాగా, నీరవ్ మోదీని 2019 మార్చి 19న యూకే పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.
ఇదిలా ఉంటే కేసు విచారణలు జరిగేటప్పుడు నీరవ్ మోదీని ఎక్కువసార్లు జైలు నుంచే వర్చువల్గా పోలీసులు హాజరుపరిచారు. అనేక సార్లు నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ను మేజిస్ట్రేట్ కోర్టుతో పాటు హైకోర్టు కూడా తిరస్కరించింది. బెయిల్ వస్తే అతడెక్కడ ఆధారాలు మాయం చేస్తాడేమోనన్న అనుమానాలతో బెయిల్ పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. ఇక భారతదేశంలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసుల కింద నీరవ్ మోదీ నేరారోపణలను ఎదుర్కుంటున్నారు. ఇవే కాకుండా అతనిపై మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి.
హైదరాబాద్లోని బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!
Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్ చేసిన రియల్ హీరో.. చివరికి ఏమైందంటే.!
ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?