‘భారత్‌ తరపున క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు దేశ సంస్కృతిని ప్రతిబింబించవు’

మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా మాజీ అధికార ప్రతినిధులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఖతార్‌ ఆదివారం ఇండియన్‌ ఎంబసీకి సమన్లు జారీ..

భారత్‌ తరపున క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు దేశ సంస్కృతిని ప్రతిబింబించవు
India Qatar

Updated on: Jun 06, 2022 | 2:15 PM

Qatar summons Indian envoy: మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా మాజీ అధికార ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఖతార్‌ ఆదివారం ఇండియన్‌ ఎంబసీకి సమన్లు జారీ చేసింది. ఐతే సదరు వ్యాఖ్యలు భారత ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రతిబింబించవని స్పష్టం చేస్తూ భారత రాయబారి ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ పరిణామంపై పశ్చిమాసియా దేశాలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా దేశాలు ఈ విషయమై స్పందించాయి. ఖతార్‌ అధికారిక పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆ దేశంలో అడుగిడిన కొన్ని గంటల వ్యవధిలోనే దోహా రాయబార కార్యలయం నుంచి భారత విదేశాంగ రాయబారి దీపక్ మిట్టల్‌కు నోట్‌ అందింది. భారత్‌లో అధికారంలో కొనసాగుతున్న పార్టీ ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విచారకరమని, వాటిని ఖండిస్తున్నట్లు నోట్‌లో పేర్కొంది.

”భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతికి అనుగుణంగా భారత ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుంది. ఏ మతాన్ని కించపరచదు. ఒక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఇద్దరు అధికారిక ప్రతినిధులలో ఒకరిని పార్టీ సస్పెండ్‌ చేయగా, మరొకరిని పార్టీనుంచి బహిష్కరించింది. ఈ విషయమై భారత ప్రభుత్వం తరపున క్షమాపణలు తెలుపుతున్నట్లు” భారత రాయబారి మిట్టల్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా ఇంధన, వాణిజ్యం, భద్రత వంటి కీలకమైన రంగాలలో భారత్‌- ఖతార్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఖతార్‌లో 7,00,000కు పైగా భారత సంతతి పౌరులు నివసిస్తున్నారు. వీరిలో వైద్యం, ఇంజనీరింగ్, విద్య, ఫైనాన్స్, వ్యాపార రంగాల్లో బ్లూ కాలర్ కార్మికులు, నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us