
PM Modi in France: ఫ్రాన్స్తో నా సంబంధం దాదాపు 40 ఏళ్లనాటిదని ఎన్నారైలతో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పారిస్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ తనకు ఫ్రాన్స్కు మధ్య ఉన్న పాత సంబంధాలను ప్రస్తావించారు. ఫ్రాన్స్తో నాకున్న అనుబంధం చాలా పాతదని చెప్పారు. నా ప్రతీ కణం, ప్రతీ క్షణం దేశం కోసమే అని అన్నారు. భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడ మినీ ఇండియా ఏర్పడుతుందన్నారు. నాగరికతకు, ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదని అన్నారు. ప్రపంచంలో అతిప్రాచీన భాష తమిళ్ అని..
తమిళ్ భారతీయ భాషకావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. దేశంలో పేదరికం అంతిమ దశలో ఉందన్నారు. త్వరలోనే భారత్ 5 ట్రిలియన్ ఎకానమీ కాబోతోందన్నారు. ప్రపంచంలో 46శాతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారత్లోనే జరుగుతున్నాయన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ పాత్ర వేగంగా మారుతోందన్నారు.
ఫ్రాన్స్తో నా అనుబంధం చాలా కాలంగా ఉందని, దానిని మర్చిపోలేనని ప్రధాని మోదీ అన్నారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం అహ్మదాబాద్లో ఫ్రెంచ్ సాంస్కృతిక కేందం ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలో నేను మొదటి సభ్యుడిని, అదే సభ్యుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాన్నాడు. కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం ఆ సభ్యత్వ కార్డు నకలును ఇచ్చిందని, నేటికీ అది నాకు వెలకట్టలేనిదన్నారు.
ఇది ఫ్రాన్స్ అవగాహన, ప్రశంసలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది 1860లో అహ్మదాబాద్లో స్థాపించబడిందని గుర్తు చేశారు.
నేను దేశానికి దూరంగా ఉన్నప్పుడు ‘భారత్ మాతా కీ జై’ నినాదం వింటే, నేను ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో అన్నారు. వాతావరణ మార్పు, ప్రపంచ సరఫరా గొలుసు, తీవ్రవాదం, తీవ్రవాదం ఇలా ప్రతి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్కున్న అనుభవం ప్రపంచానికి ఉపయోగపడుతున్నదని ఆయన అన్నారు.
భారతదేశ చరిత్ర వేల సంవత్సరాల నాటిదని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ చేస్తున్నకృషికి హద్దులు లేవన్నారు. భారతదేశం ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’, భారతదేశం ‘వైవిధ్యం నమూనా’ కూడా. ఇదే మన గొప్ప శక్తి, బలం అని అన్నారు. ఈ 10 సంవత్సరాల్లో5 అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఏర్పడిందన్నారు.
PM Narendra Modi speaks of him taking membership of Alliance Francais around 40 years back. Here is his membership card. pic.twitter.com/92J5QLAhGw
— ANI (@ANI) July 13, 2023
ప్రస్తుతం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి భారతదేశంలో రివర్స్ కౌంటింగ్ ప్రతిధ్వని వినిపిస్తోందని ప్రధాని అన్నారు. ఈ చారిత్రత్మక ప్రయోగం భారత్లో జరగబోతోంది. నేను తీర్మానంతో బయటకు వచ్చానని ప్రధాని మోదీ చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం