Pakistan: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో బాంబ్ దాడి.. పీటీఐ నాయకుడు సహా 8 మంది మృతి..

|

Mar 21, 2023 | 12:01 AM

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా నుంచి పెద్ద వార్త బయటకు వచ్చింది. ఇక్కడ జరిగిన దాడిలో ఒక పీటీఐ నాయకుడు మరణించాడు. అతనితో పాటు మరో 7 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.

Pakistan: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో బాంబ్ దాడి.. పీటీఐ నాయకుడు సహా 8 మంది మృతి..
Pakistan Bomb Blast
Follow us on

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా నుంచి పెద్ద వార్త బయటకు వచ్చింది. ఇక్కడ జరిగిన దాడిలో ఒక పీటీఐ నాయకుడు మరణించాడు. అతనితో పాటు మరో 7 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం, పీటీఐ నాయకుడు అతిఫ్ మున్సిఫ్ ఖాన్, మరో 7 మంది ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగులు ఈ దాడి చేశారు.

జియో టీవీ వార్తల ప్రకారం, వాహనాన్ని టార్గెట్‌గా చేసుకుని రాకెట్ బాంబ్‌ని వదిలేశారు. దీంతో వాహనం మంటల్లో కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో వాహనం పొగలో కాలిపోతున్నట్లు చూడవచ్చు.

ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అబోటాబాద్ జిల్లా హవేలియన్‌లో ఈ దాడి జరిగినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..