మళ్ళీ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

| Edited By:

Jul 26, 2019 | 1:55 PM

తరచూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మరో సంచలనానికి తెరలేపారు. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉంటూనే దక్షిణ కొరియాకు హెచ్చరికగా క్షిపణి ప్రయోగాలు చేపట్టారు. తక్కువ దూరాను ఛేదించే సత్తా కలిగిన రెండు స్వల్ప శ్రేణి క్షిపణుల్ని గురువారం ప్రయోగించినట్టు కిమ్ ప్రకటించారు. గత నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య కుదిరిన అణు నిరోధక చర్చల తర్వాత జరిగిన మొదటి క్షిపణి ప్రయోగం […]

మళ్ళీ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం
Follow us on

తరచూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మరో సంచలనానికి తెరలేపారు. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉంటూనే దక్షిణ కొరియాకు హెచ్చరికగా క్షిపణి ప్రయోగాలు చేపట్టారు. తక్కువ దూరాను ఛేదించే సత్తా కలిగిన రెండు స్వల్ప శ్రేణి క్షిపణుల్ని గురువారం ప్రయోగించినట్టు కిమ్ ప్రకటించారు. గత నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య కుదిరిన అణు నిరోధక చర్చల తర్వాత జరిగిన మొదటి క్షిపణి ప్రయోగం ఇదే కావడం గమనార్హం. ఈసందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ దక్షిణ కొరిగా శాంతి పేరుతో అశాంతిని రేపుతోందని విమర్శించారు. అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు చేస్తోందన్నారు. తమ హెచ్చరికలు పట్టించుకోకపోతే నష్టపోతారంటే కిమ్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే అమెరికాతో శాంతి చర్చలు కొనసాగుతాయని ఆదేశం స్పష్టం చేసింది. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఈ ప్రయోగం తాము చేపట్టినట్టు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ధ్రువీకరించారు. ప్రయోగించబడ్డ రెండు మిస్సైల్స్‌లో ఒకటి 430 కిలోమీటర్ల దూరం దూసుకుపోగా, రెండోది 690 కిలోమీటర్లు ప్రయాణించినట్టు సియోల్‌లోని అధికారి తెలిపారు. అయితే ఈ ప్రయోగం ద్వారా పొరుగు దేశం దక్షిణ కొరియానే లక్ష్యంగా భయపెట్టదలిచినట్టుగా తెలుస్తోంది.