Maldives: భారతీయుల దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులపై సస్పెన్షన్ వేటు..

భారత ప్రధాని మోదీ తోపాటు, భారతీయులపై మాల్దీవులు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ నడుస్తోంది. బాయ్ కాట్ మాల్‎దీవ్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు తమ టూర్‎లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో స్పందించింది మాల్దీవులు ప్రభుత్వం. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Maldives: భారతీయుల దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులపై సస్పెన్షన్ వేటు..
Pm Modi

Updated on: Jan 08, 2024 | 9:00 AM

భారత ప్రధాని మోదీ తోపాటు, భారతీయులపై మాల్దీవులు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ నడుస్తోంది. బాయ్ కాట్ మాల్‎దీవ్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు తమ టూర్‎లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో స్పందించింది మాల్దీవులు ప్రభుత్వం. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ వెల్లడించారు. ఇందులో షియూనా, మాల్షా, హసన్ జిహాన్ అనే ముగ్గురు మంత్రులు ఉన్నట్లు తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ మాల్డీవుల్లో పర్యటించారు. అక్కడి బీచ్ లో ఫోటో షూట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై మాల్దీవులు ఎంపీలు మోదీతో పాటు, భారతీయులపై తమ అక్కస్సును వెళ్లగక్కారు. భారత టూరిజం విధానంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా స్పందించారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీని తోలుబొమ్మగా అభివర్ణించారు మరియం షియునా. అలాగే ఎంపీ షరీఫ్ స్పందిస్తూ బీచ్ టూరిజంలో మాల్దీవులతో భారత్ పోటీ పడటం అనేది పెద్ద సవాలుగా అభివర్ణించారు. దీంతో తీవ్ర దుమారం రేగింది. గతంలో కూడా మోదీ లక్షద్వీప్ ను పర్యటించినప్పుడు సాహసాలు చేయాలనుకునే వారు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు అని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. తద్వారా లక్షద్వీప్ టూరిజం విపరీతంగా పెరిగింది. అయితే మాల్దీవుల్లో పర్యటించిన మోదీ తన వీడియోలు పోస్ట్ చేయడంతో అక్కడి మంత్రులు ఇలా స్పందించడం తీవ్ర దుమారం రేపుతోంది. సామాజిక మాధ్యమాల ప్రభావం ఆ దేశంలోని ముగ్గురు మంత్రులపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..