ఆ దేశంలో 50 ఏళ్లలో ఒక్క రైలు ప్రమాదం కూడా లేదు.. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన రైలు ప్రయాణం ఎక్కడో తెలుసా..

|

Oct 31, 2023 | 8:09 PM

భారత్‌లో గత పదేళ్లలో 697 రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే గత 10 ఏళ్లలో రైళ్ల ప్రమాదాలను పోల్చి చూస్తే .. ప్రమాదాల సంఖ్య తగ్గిందనే విషయం అర్థమవుతుంది. దీనికి చాలా కారణాలున్నాయి. ఉదాహరణకు భారతీయ రైల్వే అనేక సందర్భాల్లో రైళ్లను నవీకరించింది. ప్రపంచంలో సురక్షితమైన రైళ్ల గురించి మాట్లాడినట్లయితే.. జపాన్  మొదటి స్థానంలో ఉంది. జపాన్‌లో చివరి రైలు ప్రమాదం 1964లో జరిగింది. దీని తర్వాత ఇప్పటి వరకు ఒక్క రైలు ప్రమాదం కూడా  జరగలేదు. అటువంటి పరిస్థితిలో ఈ దేశంలో రైలు ప్రమాదాలు జరగకుండా జపాన్ రైల్వే సంస్థ ఏ చర్యలు తీసుకుందనేది అందరిలోనూ తలెత్తే ప్రశ్న. 

ఆ దేశంలో 50 ఏళ్లలో ఒక్క రైలు ప్రమాదం కూడా లేదు.. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన రైలు ప్రయాణం ఎక్కడో తెలుసా..
Japanese Railway Safety
Follow us on

ఈ ఏడాది కాలంలో భారత దేశంలో వరసగా భారీ రైలు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో రైలు ప్రమాదం జరగగా.. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం జరిగింది. వాస్తవానికి మన దేశంలో గత పదేళ్లలో 697 రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే గత 10 ఏళ్లలో రైళ్ల ప్రమాదాలను పోల్చి చూస్తే ప్రమాదాల సంఖ్య తగ్గాయనే చెప్పవచ్చు. ఇలా రైలు ప్రమాదాలు తగ్గడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా భారతీయ రైల్వేను సందర్భానుసారంగా రైళ్లను నవీకరిస్తూ ఉంది. దీంతో ప్రమాదాల సంఖ్య తగ్గింది. అయితే మనం ప్రపంచంలో సురక్షితమైన రైళ్ల గురించి మాట్లాడినట్లయితే.. జపాన్  మొదటి స్థానంలో ఉంది.

జపాన్‌లో చివరి రైలు ప్రమాదం 1964లో జరిగింది. దీని తర్వాత ఇప్పటి వరకు ఒక్క రైలు ప్రమాదం కూడా  జరగలేదు. అటువంటి పరిస్థితిలో ఈ దేశంలో రైలు ప్రమాదాలు జరగకుండా జపాన్ రైల్వే సంస్థ ఏ చర్యలు తీసుకుందనేది అందరిలోనూ తలెత్తే ప్రశ్న.

జపనీస్ రైళ్లను సురక్షితంగా చేసే ఫీచర్లు

  1. అధునాతన సాంకేతికత: జపాన్ రైళ్లు సాంకేతికతకు అనుకూలమైనవిగా మార్చబడ్డాయి.  ఈ రైళ్లు  అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. ఈ సిస్టమ్ కొన్ని సెకన్లలో రైళ్లను ఆపివేస్తుంది. అధునాతన కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది రైలుపై నిఘా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు అధునాతన సిగ్నల్ సిస్టమ్, కంట్రోల్ సిస్టమ్, రైలు రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. ఇవి రైలును సురక్షితంగా ఉంచడంలో.. ప్రమాదాల గ్రాఫ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
  2. భూకంప నిరోధక వ్యవస్థ: భూకంపం సంభవించే ముందు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఇటువంటి సాంకేతికతఅక్కడ రైళ్లలో చేర్చబడింది. ఇక్కడ రైల్వే లైన్‌లోని వివిధ ప్రదేశాల్లో సీస్మోగ్రాఫ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జపాన్ టైమ్స్ నివేదిక ప్రకారం ఇక్కడి వ్యవస్థ భూకంపం తరంగాలను చదివి, భూకంప కేంద్రం సుమారు స్థానాన్ని కనుగొంటుంది. ఈ సిస్టమ్ అప్రమత్తమైన తర్వాత రైలు స్పీడ్ ను తగ్గిస్తుంది. తద్వారా రైలు ఆగుతుంది. నష్టం ప్రమాదం తగ్గుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. తేలికైన డిజైన్: మరో నివేదికలో ఈ రైళ్ల బరువు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఫలితంగా రైళ్లను తరలించడానికి తక్కువ శక్తి అవసరం. అంతేకాదు ట్రాక్‌ నిర్వహణకు అంతగా అవసరం లేదు. అంతేకాదు ఇక్కడ ట్రైన్ సిస్టమ్ ఎప్పటికప్పుడు సాంకేతికతకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడుతుంది.
  5. నిర్వహణ, తనిఖీలో కఠినత: జపాన్‌లో రైళ్ల నిర్వహణకు సంబంధించి కఠినంగా వ్యవహరిస్తారు. నిర్వహణ స్థాయి తనిఖీ చేయబడుతుంది. ఈ సమయంలో రైల్వే నిపుణులు తయారు చేసిన మాన్యువల్‌ను పోల్చి చూస్తారు. ఫలితంగా రైలులోని అన్ని వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయి వీటిలో ఎంత మార్పు అవసరమో తెలుసుకోవచ్చు.
  6. నిపుణుల బృందం: జపాన్ రైల్వేలో అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణుల బృందం ఉంది. ఈ నిపుణులు అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి శిక్షణ పొందుతారు. ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించి నివేదికలు కూడా ఇస్తుంటారు.
  7. సురక్షిత సంస్కృతి: జపాన్‌లో భద్రతా సంస్కృతిపై ఎల్లప్పుడూ దృష్టి పెడతారు. విశేషమేమిటంటే ఇక్కడ రైల్వేలు, ఉద్యోగులు మాత్రమే భద్రతా మార్గదర్శకాలను పాటించడమే కాకుండా ప్రయాణికులు కూడా వాటిని కచ్చితంగా పాటిస్తారు. అందువల్ల రైళ్ల ప్రమాదాలు జరిగే అవకాశం అతి తక్కువగా ఉంటాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..