Shigella Bacteria: గాజాలో ఇజ్రాయెల్ సైనికులకు ప్రాణాంతక వ్యాధి.. ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుందంటే..

|

Dec 11, 2023 | 8:27 PM

CDC ప్రకారం సంక్రమణ తర్వాత కొన్ని రోజుల అనంతరం ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తాయి. షిగెల్లా సోకిన వ్యక్తులు దీర్ఘకాలిక రక్తపు విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిరి, నిర్జలీకరణం వంటి లక్షణాలతో ఇబ్బంది పడతారు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువ కాలం ఉంటాయి. ఇన్ఫెక్షన్ కు సకాలంలో చికిత్స చేయకపోతే .. ఈ వైరస్ రక్తంలోకి చేరితే ప్రాణాంతకం కావచ్చు.

Shigella Bacteria: గాజాలో ఇజ్రాయెల్ సైనికులకు ప్రాణాంతక వ్యాధి.. ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుందంటే..
Israeli Army
Follow us on

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండు నెలలు దాటింది. హమాస్ ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయిల్ గాజాపై దాడి చేస్తోంది. అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ సైనికులను ఒక వ్యాధి చుట్టుముట్టింది. ఇది వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుందని అమెరికన్ హెల్త్ ఏజెన్సీ CDC చెబుతోంది. గాజాపై భూదాడిలో పాల్గొన్న ఇజ్రాయెల్ సైనికుల్లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ సైనికుల్లో వ్యాపిస్తున్న వ్యాధి పేరు షిగెల్లా..

షిగెల్లా వ్యాధి అంటే ఏమిటి, ఎలా వ్యాపిస్తుంది.. ఎలా ప్రాణాంతకంగా మారుతుందో తెలుసుకోండి.

వ్యాధి ఏమిటి? ఎలా వ్యాపిస్తుందంటే

షిగెల్లా అనేది ఒక వైరస్. US హెల్త్ ఏజెన్సీ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం  షిగెల్లా సోకిన వ్యక్తి  మలంతో ఈ బ్యాక్టీరియా సులభంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలు  ఏమిటంటే

ఈ వైరస్ సోకిన వ్యక్తి నుండి షిగెల్లా బాక్టీరియా ఇతరులకు ఈజీగా సోకుంటుంది. బాధితులు తాకిన వస్తువులను తాకితే సులభంగా ఈ వైరస్ బారిన పడతారు.

ఇవి కూడా చదవండి

షిగెల్లా సోకిన వ్యక్తి తయారుచేసిన ఆహారాన్ని తినడం ద్వారా కూడా వ్యాపిస్తుంది.

ఈ వైరస్ సోకిన వ్యక్తితో శారీరకంగా కలిసినా.. మురుగు నీరు లేదా కలుషితమైన నీరు ద్వారా ఈ వైరస్ సోకుతుంది.

ఇజ్రాయెల్ సైనికులకు షిగెల్లా ఎలా వ్యాపించిందంటే

షిగెల్లా వ్యాధి ఇజ్రాయెల్ సైనికులకు అపరిశుభ్రమైన వాతావరణం, పారిశుధ్యం తక్కువగా ఉండడంతో పాటు  యుద్ధభూమిలో కలుషితమైన ఆహారం కారణంగా వ్యాపిస్తోంది. ఇజ్రాయెల్ వైద్యులు చెప్పిన ప్రకారం ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ ప్రజలు గాజాలో ఉన్న సైనికులకు తయారు చేసి పంపుతున్న ఆహారమే.

షిగెల్లా బ్యాక్టీరియా హానికరమైన ఆహారంతో సంక్రమించవచ్చు. రవాణా సమయంలో ఆహారాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం లేదా సైనికులు వేడి చేయకుండా తినే అవకాశం ఉన్నందున ఈ బ్యాక్టీరియా సైనికులకు సోకుతుంది. వ్యాధి సోకిన సైనికులను క్వారంటైన్ చేసి చికిత్స కోసం గాజా నుంచి ఇజ్రాయెల్ కు తిరిగి పంపుతున్నారు.

ఈ వైరస్ సంక్రమణను ఎలా గుర్తించాలంటే?

CDC ప్రకారం సంక్రమణ తర్వాత కొన్ని రోజుల అనంతరం ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తాయి. షిగెల్లా సోకిన వ్యక్తులు దీర్ఘకాలిక రక్తపు విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిరి, నిర్జలీకరణం వంటి లక్షణాలతో ఇబ్బంది పడతారు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువ కాలం ఉంటాయి. ఇన్ఫెక్షన్ కు సకాలంలో చికిత్స చేయకపోతే .. ఈ వైరస్ రక్తంలోకి చేరితే ప్రాణాంతకం కావచ్చు.

ఈ వ్యాధికి చికిత్స ఏమిటంటే?

US ఆధారిత CDC ప్రకారం షిగెల్లా వైరస్ సోకిన రోగులు యాంటీబయాటిక్ చికిత్స లేకుండా 5 నుండి 7 రోజులలో ఎటువంటి చికిత్స లేకుండానే సులభంగా కోలుకుంటారు. తేలికపాటి ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఎక్కువ నీరు త్రాగడం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా కోలుకుంటారు. అయినప్పటికీ షిగెలోసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు ప్రేగు పని తీరును తగ్గించే .. ఆహారాన్ని జీర్ణం చేసే మందులను ఉపయోగించకూడదు. షిగెల్లా వ్యాధి నిరోధానికి ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి.

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల నుండి 165 మిలియన్ల మంది ప్రజలు షిగెల్లా బారిన పడుతున్నారని CDC అంచనా వేసింది. పరిశుభ్రత లేని నీరు, ఆహారం, కలుషితమైన ప్రదేశాలకు వెళ్లేవారిలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒక రకమైన షిగెల్లా వ్యాధి బారిన పడితే చికిత్స చేయడం చాలా కష్టం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..