
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. అబూదబీ క్యాపిటల్గా ఏడు చిన్న రాజ్యాల కలయిక. పశ్చిమాసియాలోని తూర్పు అరేబియన్ ప్రాంతం. కోటీ పదిలక్షలకు మించని జనాభా. కానీ, ఆ జనాభాలో ఎక్కువభాగం విదేశీయులే అంటే నమ్ముతారా? ఎందుకంటే, తమ దేశంలో లేనిదేదో ఆ దేశంలో ఉందని వాళ్లంతా నమ్ముతారు. ప్రపంచంలోకెల్లా అత్యంత భద్రత కల్గిన దేశంగా భావించి, అక్కడే ఫ్యామిలీకి మకాం పెట్టి అక్కడే పిల్లలను చదివిస్తున్న మన తెలుగువాళ్లు కూడా లక్షలమంది. నిన్న దుబాయ్పై ఇరాన్ దాడుల తర్వాత వారి ఆలోచన పూర్తిగా మారిపోయింది. హండ్రెడ్ పర్సెంట్ పీస్కి గ్యారంటీ ఉన్న యూఏఈ ఇప్పుడు ఆ క్రెడిట్ను దూరం చేసుకుంది. శాంతికి స్వర్గధామమన్న పేరును చేతులారా తుడిచేసుకుంది. కేవలం గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ స్థావరాల్ని ధ్వంసం చేసే ప్రయత్నంలో భాగంగా అరబ్లో జనావాసాల్ని కూడా ఛిద్రం చేస్తోంది ఇరాన్. సో, యూఏఈ కూడా నాట్ సేఫ్ అన్నమాట. గతంలో ఏ దేశంతోనూ నేరుగా కయ్యానికి దిగిన చరిత్రే లేదు అరబ్ ఎమిరేట్స్కి. అటువంటి పసికూనను కూడా తన ఉక్కుకౌగిలిలో బంధించి, నెత్తుటి క్రీడలో ముంచి, ఆగమాగం చేసి వికటాట్టహాసం చేస్తోంది అమెరికా. ఇజ్రాయెల్ కోసం ఎందాకైనా అంటున్న అమెరికా.. 10 మిత్రదేశాలతో కలిసి ఇరాన్పై దండయాత్ర.....